ప్రత్యేక సిక్కుల్యాండ్ కోసం పోరాడిన సిక్కులకు ఊరట
1980 సంవత్సరంలో భారత్కు వ్యతిరేకంగా సిక్కుల్యాండ్ కోసం ప్రచారం నిర్వహించిన సిక్కుమిలిటెంట్లకు భారత ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. గత నలబై సంవత్సరాలుగా విదేశాల్లో తలదాచుకుంటున్న 312 మంది సిక్కులు భారత్ను సందర్శించే హక్కును కల్పించింది. ఈ నేపథ్యంలోనే భారత వీసా జారీ చేసేందుకు అంగీకరించింది. నిషేధిత జాబితాలో ఉన్న మొత్తం 314 మందికి గాను ఇద్దరు మినహా వీసాల జారీపై నిషేధాన్ని తొలగించింది.ఇందుకు సంబంధించి కేంద్రహోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
1980కి ముందు భారత్లో నివసించే కొంతమంది సిక్కులతో పాటు విదేశాల్లో నివసించే సిక్కులు భారత దేశానికి వ్యతిరేకంగా సిక్కుహోం ల్యాండ్ కావాలంటూ మిలిటెంట్ ప్రచారం నిర్వహించారు. దీంతో వారిపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే వారు దేశం విడిచి పారిపోయారు. చాల మంది కెనడా,యూకే,యూఎస్,జర్మని,యూరప్లకు వెళ్లి ఆయా దేశాల పౌరసత్వం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2015 లో లండన్ పర్యటన సందర్భంగా యుకెకు చెందిన సిక్కులతో జరిగిన సమావేశంలో ఈ జాబితాను సమీక్షించడానికి అంగీకరించారు. మరియు దీనికి సంబంధించి పూర్తి కసరత్తు చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను ఆదేశించారు.