వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lunar eclipse 2020: ఉపఛాయ చంద్రగ్రహణం, భారత్‌లో చూడగలమా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం నవంబర్ 30న కార్తీక పూర్ణిమ నాడు సంభవించనుంది. ఇది ఉపఛాయ చంద్రగ్రహణం. ఈ ఏడాదిలో చివరిది కావడంతో ఈ చంద్రగ్రహణానికి ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రహణ సమయం, ప్రభావం, భారతదేశంలో ఈ చంద్రగ్రహణాన్ని చూడవచ్చా? లాంటి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Recommended Video

Upachhaya Lunar Eclipse: Last lunar Eclipse of 2020 | Oneindia Telugu
30న మధ్యాహ్నం నుంచి చంద్రగ్రహణం..

30న మధ్యాహ్నం నుంచి చంద్రగ్రహణం..

ఈ చంద్రగ్రహణం కంటికి కనిపించదు కాబట్టి.. దీన్ని ఉపఛాయ చంద్ర గ్రహణం అని పిలుస్తున్నారని ఖగోళ నిపుణులు పేర్కొన్నారు. ఈ ఉపఛాయ చంద్రగ్రహణం సోమవారం మధ్యాహ్నం ఏర్పడనుందని వెల్లడించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈ చంద్రగ్రహణం సంభవించనుంది. చంద్రగ్రహణం ప్రారంభ సమయం: నవంబర్ 30 మధ్యాహ్నం 1:04 గంటలకు చంద్ర గ్రహణ మధ్య కాలం: నవంబర్ 30 మధ్యాహ్నం 3:13 గంటలకు చంద్రగ్రహణం ముగింపు సమయం: నవంబర్ 30 సాయంత్రం 5:22 గంటలకు.

ఇది ఉపఛాయ గ్రహణం ఎందుకంటే..

ఇది ఉపఛాయ గ్రహణం ఎందుకంటే..

జ్యోతిష్కులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ చంద్రగ్రహణం 2020లో చివరిది. వృషభం రాశి, రోహిణి నక్షత్రాన్ని ప్రభావితం చేస్తుందని, దాదాపు అన్ని రాశిచక్ర గుర్తులపై కూడా ప్రభావం చూపుతుందని జ్యోతిష్కులు వివరించారు. కాగా, ప్రతి గ్రహణానికి సుతక్ కాలం ఉంటుంది, ఈ సమయంలో మంత్రాలు జపించి ధ్యానం చేయాలని సూచించారు. రాబోయే చంద్ర గ్రహణంలో, సుతక్ కాలం చెల్లుబాటు కాదు ఎందుకంటే ఇది 'ఉపఛాయ' గ్రహణం. ఈ గ్రహణం కంటికి కనిపించదని చెబుతున్నప్పటికీ.. ఖగోల నిపుణులు మాత్రం నవంబర్ 30న సంభవించే ఈ ఛాయ చంద్రగ్రహణం భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, పసిఫిక్ సముద్రం, ఆసియా ప్రాంతాలవారికి కనిపిస్తుందని తెలిపారు.

భారతదేశంలో ఏయే ప్రాంతాల్లో చూడవచ్చు..

భారతదేశంలో ఏయే ప్రాంతాల్లో చూడవచ్చు..

భారతదేశంలో అంతరిక్ష ప్రియులు, స్కైగేజర్ల కోసం, ఈ సందర్భం కొంచెం నిరాశపరిచింది. ఎందుకంటే చంద్రుడు హోరిజోన్ క్రింద ఉంటుంది. కాబట్టి మొత్తం చంద్ర గ్రాహనం భారతదేశంలో కనిపించదు. ఏదేమైనా, దేశంలోని కొన్ని ఉత్తర, తూర్పు ప్రాంతాలలో ప్రజలు ఉపఛాయ గ్రహణాన్ని చూడగలుగుతారు. దేశంలోని పాట్నా, రాంచీ, కోల్‌కతా, లక్నో, వారణాసి, భువనేశ్వర్ ప్రాంతాల ప్రజలు ఈ గ్రహాణాన్ిన వీక్షించే అవకాశం ఉంది.

English summary
The last and the final lunar eclipse or 'Chandra Grahan' of 2020 is all set to take place on November 30. The fourth penumbral lunar eclipse of the year or 'Upachhaya' will occur on the date of Shukla Paksha of Kartik month, or Karthik Purnima.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X