కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా, చంద్రబాబు-రజనీకాంత్ సహా హాజరు
Recommended Video
చెన్నై: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం మరోసారి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ పాల్గొన్న కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. డీఎంకే కార్యాలయంలో కరుణానిధి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
సోనియా గాంధీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, రాహుల్ గాంధీ, పినరాయి విజయన్, రజనీకాంత్, శత్రుఘ్నసిన్హా, కుష్బూ, వైగో తదితర ప్రముఖులు వచ్చారు.
అన్నా అరివాలయంలోని డీఎంకే ప్రధాన కార్యాయంలో కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఈవెంట్లో పార్టీలకు అతీతంగా హేమహేమీలు వచ్చారు. డీఎంకే చీఫ్, కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యతకు ఈ ఈవెంట్తో మరింత బలం చేకూర్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
Chennai: UPA chairperson Sonia Gandhi unveils former Tamil Nadu Chief Minister M Karunanidhi's statue, at DMK headquarters pic.twitter.com/hM34stQqof
— ANI (@ANI) December 16, 2018
Chennai: UPA chairperson Sonia Gandhi & Congress President Rahul Gandhi pay tribute to former Tamil Nadu Chief Minister M Karunanidhi at his memorial at Marina Beach. pic.twitter.com/GnCFHH8hU8
— ANI (@ANI) December 16, 2018