వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాబిలమ్మను చేర ఇంకా ఆలస్యం -చంద్రయాన్-3 వాయిదా -ఇస్రో చీఫ్ శివన్ కీలక ప్రకటన

|
Google Oneindia TeluguNews

జాబిలమ్మను చేరుకోవాలన్న భారత్ కల ఇంకాస్త ఆలస్యం కానుంది. చంద్రుడిని చేరే ప్రయత్నంలో భాగంగా భారత్‌ తలపెట్టిన అంతరిక్ష యాత్ర చంద్రయాన్‌ 3 వాయిదాపడింది. దీనిని 2022లో చేపడతామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. గ‌తేడాది క‌రోనా కార‌ణంగా ఇస్రో ప్ర‌ధాన ప్రాజెక్టులు ఆల‌స్య‌మైన క్రమంలో వాటిపై ఇస్రో చీఫ్ శివన్ ఆదివారం కీలక ప్రకటన చేశారు.

 ys sharmilaతో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కొడుకు భేటీపై చర్చ -4పదవులున్న కుటుంబం -విజయమ్మ చక్రం! ys sharmilaతో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కొడుకు భేటీపై చర్చ -4పదవులున్న కుటుంబం -విజయమ్మ చక్రం!

2019 సెప్టెంబరు నాటి చంద్రయాన్‌-2 ప్రయోగం తృటిలో విఫలమైననా.. పట్టు వదలకుండా ఇస్రో తన ప్రయత్నాలను కొనసాగించి.. 2020 డిసెంబర్ లోనే చంద్రయాన్-3ని లాంచ్ చేయాలనుకుంది. కానీ, కొవిడ్‌-19 ప్రభావం చంద్రయాన్‌-3, మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌తో సహా పలు ఇస్రో ప్రాజెక్టులపై పడినట్టు సంస్థ చైర్మన్‌ శివన్‌ వివరించారు.

Chandrayaan-3 Launch Delayed Further to 2022, Says ISRO Chief K Sivan

''ఈ ప్రయోగాల విషయమై మేము పరిశోధనలు జరుపుతున్నాము. ఇది కూడా చంద్ర‌యాన్‌-2 కాన్ఫిగ‌రేష‌న్ వంటిదే. కానీ ఇందులో ఆర్బిట‌ర్ ఉండ‌దు. చంద్ర‌యాన్‌-2లో లాంచ్ చేసిన ఆర్బిట‌ర్‌నే చంద్ర‌యాన్‌-3కి వాడుకుంటాము. ఈ నేపథ్యంలో ఈ మిషన్‌ను వచ్చే 2022 సంవత్సరంలో ప్రయోగించేందుకు కృషి చేస్తున్నాం'' అని శివన్‌ తెలిపారు.

Viral Video: నగ్నంగా ఏనుగుపై పోజులు -టెన్నిస్ లెజెండ్ కూతురి నిర్వాకం -విషాదకర ఘటనగా..Viral Video: నగ్నంగా ఏనుగుపై పోజులు -టెన్నిస్ లెజెండ్ కూతురి నిర్వాకం -విషాదకర ఘటనగా..

ఇస్రో భవిష్యత్తులో పలు గ్రహాంతర యాత్రలను చేపట్టనున్న నేపథ్యంలో.. అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని చాటిచెప్పే గీటురాయిగా చంద్రయాన్‌-3 కీలకం కానుంది. ఈ ప్రయోగం అనంతరం ముగ్గురు భారతీయులను అంతరిక్షంలోకి పంపే గగన్‌యాన్‌-3 ప్రాజెక్టుపై దృష్టి సారిస్తామని శివన్‌ తెలిపారు. ఇందుకుగానూ నలుగురు భారత వ్యోమగాములు అవసరమైన శిక్షణ పొందుతున్నారని ఆయన వెల్లడించారు. ఇప్ప‌టికే దీని కోసం ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములు ర‌ష్యాలో శిక్ష‌ణ పొందుతున్నారు.

English summary
Chandrayaan-3, India's third mission to Moon, is likely to be launched in 2022, ISRO chief K Sivan has said. The COVID-19 lockdown has hit several projects of the Indian Space Research Organisation (ISRO) including Chandrayaan-3, which was scheduled to be launched in late 2020, and Gaganyaan, the country's first manned space mission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X