ముంబై ఎయిర్పోర్టులో సిస్టమ్ క్రాష్: బారులు తీరిన ప్రయాణికులు, ట్విట్టర్లో వేదనలు
ముంబై: వాణిజ్య రాజధాని ముంబై విమానాశ్రయం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. భారీ ఎత్తున క్యూలలో ప్రయాణికులు పడిగాపులు గాస్తున్నారు. ముంబై ఎయిర్పోర్టు టెర్మినల్ 2 వద్ద కంప్యూటర్ సిస్టమ్ క్రాష్ అవడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో ఇప్పుడు మాన్యువల్ మోడ్లో చెక్-ఇన్లు జరుగుతున్నందున క్యూలు పెరిగిపోయాయి.
ఈ కారణంగా ఫ్లైట్ టేకాఫ్ షెడ్యూల్ను కూడా ఇది ప్రభావం చేసే అవకాశం ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం రెండు టెర్మినల్స్లో ఒకటి, T2 ఎక్కువగా అంతర్జాతీయ విమానాలతో వ్యవహరిస్తుంది. కానీ దేశీయ మార్గాల కోసం కూడా ఉంది.
సాయంత్రం 6 గంటల ముందు.. 'ప్రయాణికులు ఒక గంట నుంచి సామాను తీసుకోవడం కోసం వేచి ఉండవలసి వస్తుంది' అని మిర్రర్ నౌ నివేదించింది. ఢిల్లీలో ఉన్న విమానాశ్రయం తర్వాత ముంబైలోని విమానాశ్రయం భారతదేశంలో రెండవ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం కావడం గమనార్హం.
The sheer timing of you placing your bag for check in and all systems going down at that exact moment at Mumbai Airport @CSMIA_Official! 😶
— Ritu Mittal Mukherjee (@ritu__mukherjee) December 1, 2022
Complete standstill and this is how we begin the weekend!
చాలా మంది ట్విట్టర్ యూజర్లు విమానాశ్రయంలో జనాల ఫోటోలను షేర్ చేశారు. వారిలో ఒకరికి ఎయిర్ ఇండియా ఇలా సమాధానమిచ్చింది. "మా బృందం ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడానికి శ్రద్ధగా పని చేస్తోంది." అని పేర్కొంది.
We understand that delays are certainly uncomfortable. Our team is working diligently to minimize the inconvenience. They'll be in touch with you for further updates.
— Air India (@airindiain) December 1, 2022
వివరాలను పంచుకుంటున్న ట్విట్టర్ వినియోగదారులలో ఒకరు ఆమె తన బ్యాగ్ని చెక్-ఇన్ కౌంటర్లో ఉంచినప్పుడు సిస్టమ్ క్రాష్ అయ్యిందని చెప్పారు. అయితే, సిస్టమ్ క్రాష్ అవడానికి కారణాలు తెలియరాలేదు. దీనికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.