చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాడు పెళ్లి చెయ్యకుంటే చస్తానంది, నేడు రెండు నెలల ప్రియుడి కోసం చంపేసింది!

|
Google Oneindia TeluguNews

చెన్నై: గతంలో ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చెయ్యకుంటే చస్తాను అంటూ తల్లిదండ్రులను బెదిరించింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత హాయిగా కాపురం చేసుకుంటున్న సమయంలో రెండు నెలల క్రితం పరిచయం అయిన వ్యక్తితో అక్రమం సంబంధం పెట్టుకుని ఇద్దరు బిడ్డలను చంపేసింది. చివరికి కట్టుకున్న భర్తనే హత్య చెయ్యాలని ప్లాన్ వేసింది.

నా భర్తకు చావు గిఫ్ట్: మిస్ అయ్యింది, పోలీస్ ఫోన్ తో ప్రియుడికి ఫోన్, ప్లాన్ రివర్స్నా భర్తకు చావు గిఫ్ట్: మిస్ అయ్యింది, పోలీస్ ఫోన్ తో ప్రియుడికి ఫోన్, ప్లాన్ రివర్స్

ప్రియుడి మోజులో పడి కన్న బిడ్డలకు పాలులో విషం కలిపి హత్య చేసి భర్తను చంపాలనుకున్న చెన్నైకి చెందిన అభిరామిని కఠినంగా శిక్షించాలని స్వయంగా ఆమె తండ్రి సౌందర్ రాజన్ పోలీసులకు మనవి చేశాడు. అభిరామి, ఆమె ప్రియుడు సుందరంకు ఉరి శిక్ష వెయ్యాలని సౌందర్ రాజన్ డిమాండ్ చేస్తున్నారు.

పెళ్లి చెయ్యాలని పట్టు !

పెళ్లి చెయ్యాలని పట్టు !

8 సంవత్సరాల క్రితం అభిరామి, విజయ్ ప్రేమించుకున్నారు. అప్పట్లో విజయ్ ను వివాహం చేసుకుంటానని అభిరామి ఇంట్లో చెప్పింది. విజయ్ తో వివాహం చెయ్యడానికి అభిరామి తండ్రి సౌందర్ రాజన్ నిరాకరించారు. విజయ్ తో పెళ్లి చెయ్యకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని అభిరామి కుటుంబ సభ్యులను బెదిరించిది. తరువాత విజయ్, అభిరామి వివాహం చేసుకున్నారు.

కఠిన శిక్ష వెయ్యాలి

కఠిన శిక్ష వెయ్యాలి

తన మనుమడు, మనువరాలను కిరాతంగా హత్య చేసిన తన కుమార్తె అభిరామిని కఠినంగా శిక్షించాలని ఆమె తండ్రి సౌందర్ రాజన్ డిమాండ్ చేస్తున్నారు. తమ కుమార్తె అభిరామి చేసిన పనికి ఇంటి నుంచి తాము బయటకు రాలేకపోతున్నామని, మేము సంఘంలో తల ఎత్తుకుని ఎలా తిరగాలని సౌందర్ రాజన్ పోలీసుల ముందు విలపించారు.

రెండు నెలల ప్రియుడు

రెండు నెలల ప్రియుడు

అభిరామి, సుందరంకు రెండు నెలల క్రితమే పరిచయం అయ్యింది. బిరియాని అర్డర్ ఇచ్చే నెపంతో సుందరంను ఇంటికి పిలిపించుకుంటున్న అభిరామి అతనితో రాసలీలలు సాగించింది. చుట్టుపక్కల వారికి, ఇంటి యజమానికి సుందరం బిరియాని తీసుకువస్తున్నాడని అభిరామి నమ్మించింది. బిరియాని ముసుగులో భర్తను అభిరామి మోసం చేసింది.

పిల్లలకు టార్చర్

పిల్లలకు టార్చర్

సుందరం పరిచయం అయిన తరువాత అభిరామిలో చాల మార్పులు వచ్చాయని ఆమె భర్త విజయ్ పోలీసులకు చెప్పాడు. ఏదో ఒక నెపంతో తన కుమారుడు, కుమార్తెను అభిరామి ప్రతిరోజు చిత్రహింసలకు గురి చేసిందని విజయ్ బోరనవిలపిస్తున్నాడు. స్కూటర్ తీసివ్వలేదని తనను వేదింపులకు గురి చేసింది, ఇష్టం వచ్చినట్లు నా భార్య అభిరామి డబ్బు ఖర్చు చేసిందని, ఆర్థికంగా తాను చాల ఇబ్బందులు ఎదుర్కొన్నానని విజయ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

రగిలిపోతున్న ఫ్యామిలి

రగిలిపోతున్న ఫ్యామిలి

బిడ్డలను హత్య చేసి, చివరికి భర్తను హత్య చెయ్యాలని ప్లాన్ వేసి ప్రియుడితో కలిసి పారిపోవాలని ప్రయత్నించిన అభిరామి మీద ఆమె కుటుంబ సభ్యులు రగిలిపోతున్నారు. అభిరామి పిల్లలు, మా పిల్లలు కలిసి ప్రతిరోజూ ఇంటి దగ్గర ఆడుకునేవారని, ఆమె ఇంత దారుణంగా కన్నబిడ్డలను హత్య చేస్తుందని తాము ఊహించలేదని ఇంటి యజమాని అంటున్నారు.

బెయిల్ ఇవ్వం, జైలులోనే !

బెయిల్ ఇవ్వం, జైలులోనే !

అభిరామికి బెయిల్ ఇవ్వడానికి ఆమె కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, భర్త దూరం కావడం, ప్రియుడు సుందరం అరెస్టు కావడంతో అభిరామికి ఇక బెయిల్ ఇచ్చే వారు కరువైనారు. బెయిల్ రాకపోతే అభిరామి జైలుకే పరిమితం కానుందని పోలీసులు అంటున్నారు. అభిరామికి వ్యతిరేకంగా సాక్షాలు బలంగా ఉన్నాయని, పోస్టుమార్టుం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
Kundrathur Abirami farther cries for losing his two grand children. Abirami Killed her two children for illicit love.Abirami house owner says we were seeing the two children as our children. we dont know how she killed the children.Abirami had not beaten her children for even one time for any reason. Abirami's husband Vijay says that he bought mophed to his wife though he was in money crisis to run a family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X