ఆ టెక్కీ దొంగ కాదు, సీరియల్ రేపిస్ట్: 50మందిపై.. వీడియో తీసి..
చెన్నై: చోరీ చేస్తూ పట్టుబడ్డ నిందితుడు సీరియల్ రేపిస్ట్ అని తెలిసి ఒక్కసారిగా షాకయ్యారు. నిందితుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావడం గమనార్హం. తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
Recommended Video
దొంగతనం కేసులో అరెస్ట్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమ ఇంట్లో చోరీ జరిగిందని, విలువైన వస్తువులతోపాటు కొంత నగదు ఓ దొంగ ఎత్తుకెళ్లాడని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి ఫిర్యాదు అందింది పోలీసులు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు మదన్ అరివలగన్ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.
50మందిపై ఘాతుకం.. పోలీసులకు షాక్
కాగా, విచారణలో భాగంగా నిందితుడు అరివలగన్ మొబైల్లోని వీడియోలు చూసిన పోలీసులు షాకయ్యారు. దాదాపు 50మంది వరకు యువతులు, మహిళలపై అత్యాచారం జరుపుతుండగా తీసిన వీడియోలు నిందితుడి స్మార్ట్ఫోన్లో ఉన్నాయి. దీంతో ఇది మామూలు చోరీ కేసు కాదని భావించిన పోలీసులు.. నిందితుడ్ని అన్ని కోణాల్లో విచారించారు.
టెక్కీ జాబ్ వదిలేసి..
ఈ క్రమంలో తమది క్రిష్ణగిరి జిల్లా మథుర్ గ్రామం అని, క్రిష్టగిరి కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు నిందితుడు తెలిపాడు. బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేశానని, 2015లో అక్కడ జాబ్ మానేసి చెన్నైకి వచ్చినట్లు తెలిపాడు.
తొలుత దొంగగా.. ఆ తర్వాత..
తొలుత ఉద్యోగం కోసం యత్నించగా ఎవరూ పట్టించుకోలేదని, మెల్లమెల్లగా చోరీలకు అలవాటు పడ్డానని చెప్పాడు. ఆ తర్వాత ఒంటరి యువతులు, మహిళలున్న ఇళ్లే లక్ష్యంగా చోరీలు చేస్తూ, వారిపై అత్యాచారానికి కూడా పాల్పడినట్లు అంగీకరించాడు. అంతేగాక, ఆ ఘాతుకాన్ని వీడియోలు తీసి ఎవరికీ చెప్పవద్దని బెదిరిలింపులకు గురిచేశానని నిందితుడు చెప్పారు.
రేప్ను వీడియో తీసి..
ఇలా సుమారు 50మంది యువతులు, మహిళలపై అత్యాచారానికి పాల్పడి, వారిని బ్లాక్ మెయిల్ చేసినట్లు నిందితుడు అరివలగన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. కాగా, పరువు పోతుందని చాలా మంది మహిళలు ఫిర్యాదు చేయలేదని, తమకు అందిన ఒక్క ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.