చెన్నై చాణక్య జోస్యం నిజమైంది
చెన్నై :అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చెన్నై చాణక్య జోస్యం ఫలించింది.ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తాడని చాణక్య ముందే చెప్పింది. చాణక్య అంటే ఎవరో కాదు ఒక చేప. గతంలో జరిగిన పుట్ బాల్ మ్యాచ్ లో చాణక్య జోస్యాలు నిజమయ్యాయి.
అమెరికా అద్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తాడని చాణక్య జోస్యం చెప్పింది. ఈ జోస్యం ఫలించింది.ఈ ఎన్నికలకు రెండు రోజుల ముందే ట్రంప్, హిల్లరీ పోటోలను చాణక్య ఉన్న నీటి తొట్టెలో ఉంచితే, ఆ చేప ట్రంప్ ఫోటోను పట్టుకొంది.ఈ జోస్యంపై తొలుత అందరూ కొంత అపనమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇవాళ వచ్చిన ఫలితాలు మాత్రం చాణక్య జోస్యాన్ని నిజం చేశాయి.గతంలో వరల్డ్ కప్ క్రికెట్ సందర్భంగా బాగా క్రేజీ ఉండేది. పుట్ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా కూడ చాణక్య జోస్యం నిజమయ్యాయి.
హెల్మెట్ నార్ పోత్ కూడ చెప్పాడు
అమెరికా అద్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తారని యూఎస్ ప్రఖ్యాత ఎన్నికల నిపుణుడు హెల్మట్ నార్ పోత్ చెప్పాడు. ప్రైమరీలు, కాకసెస్ (పార్టీలో ఎన్నికైన సభ్యుల)లో మెజారిటీ సంపాదించిన బలమైన నేతే అమెరికా అద్యక్షుడుగా ఎన్నిక అవుతారని హెల్మట్ నార్ పోత్ విశ్లేషించాడు. ఈ విశ్లేషణ నిజమని తేలింది.1912 నుండి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో హెల్మల్ చెప్పిన ఫార్మూలా ప్రకారమే అభ్యర్థులు విజయం సాధించారు.
రెండువేల సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఈ పార్మూలా మాత్రం పనిచేయలేదు. ఈ ఎన్నికల్లో ఒబామా విజయం సాధించాడు.మారుతున్న రాజకీయ, అంతర్జాతీయ పరిస్థితులతో సంబందం ఉండదు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ప్రైమరీలు, కాకసెస్ లో పార్టీ పరంగా బలమైన నేతగా ఎదిగారని హెల్మల్ చెప్పారు పార్టీలో వ్యతిరేకత ఎదురైనా ఇది ట్రంప్ విజయంపై చూపదని హెల్మెట్ తెలిపారు.ఈ ఫార్మూలానే పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.