బిజినెస్ మెన్ బట్టలు విప్పించి.. న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్
చెన్నై : న్యూడ్ ఫోటోలతో ఓ వృద్ద బిజినెస్ మ్యాన్ ను బెదిరించి రూ.2 కోట్లు డిమాండ్ చేసింది ఓ మహిళా దోపిడి దొంగల ముఠా. కొడైకెనాల్ లోని హరింగ్ టన్ రోడ్డులో జరిగిన ఈ ఘటనలో.. రూ.45 వేలు దోచుకెళ్లిన దొంగల ముఠా చివరికి పోలీసులకు పట్టుబడక తప్పలేదు.
వివరాల్లోకి వెళితే.. చంద్రన్ అనే 75 ఏళ్ల వృద్దుడు కొడైకెనాల్ లోని ఓ హోటల్ పక్కన టీ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే.. గురువారం నాడు ఎస్టేట్ నుంచి ఇంటికి తిరిగొచ్చేశాక.. ఎస్టేట్ లోకి చొరబడ్డ కొంతమంది మహిళా దోపిడి దొంగలు.. ఎస్టేట్ లో ఉన్న పుష్ప, రాజలక్ష్మి అనే పనిమనుషులతో పాటు చంద్రన్ తమ్ముడు జగన్నాథ్ ను బంధించారు.
అనంతరం జగన్నాథ్ తమ్ముడితో పాటు పనిమనిషిని బట్టలు విప్పేయాల్సిందిగా బలవంతం చేశారు దొంగలు. కత్తితో బెదిరించి న్యూడ్ ఫోటోలు తీసుకున్న దోపిడి దొంగలు.. అనంతరం ఆ ఫోటోలను బయటపెట్టకుండా ఉండాలంటే రూ.2 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. తన వద్ద అంత డబ్బు లేదని చంద్రన్ వాదించడంతో.. కప్ బోర్డులో ఉన్న రూ.45వేలను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు.
అయితే అప్పటికే.. మరో పనిమనిషి కంట్రోల్ దోపిడి గురించి కంట్రోల్ రూమ్ ను అప్రమత్తం చేయడంతో.. పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. దోపిడి దొంగల్లో ఒకరిని మున్నార్ లో హోటల్ వ్యాపారం చేసే మణికందన్ అనే మహిళగా గుర్తించాడు చంద్రన్. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు మణికందన్ తో పాటు ఫోర్ షేర్ ఎస్టేట్ కు చెందిన మరో మహిళను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.