మెరీనా బీచ్ లో భారీ బందోబస్తు, అమ్మ సమాధి దగ్గరే ముహుర్తం, 3 వేల మంది పోలీసులు!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి దగ్గర, మెరీనా బీచ్ లో పోలీసులు మొహరిస్తున్నారు. మెరీనా బీచ్ లోని అమ్మ జయలలిత సమాధి దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మెరీనా బీచ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పోలీసులే దర్శనం ఇస్తున్నారు.
పన్నీర్ సెల్వందే తుది నిర్ణయం: నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మా నాయకుడు!
అన్నాడీఎంకే పార్టీలోని పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు విలీనం కావడానికి దాదాపు నిర్ణయించారు. సోమవారం పళనిసామి వర్గం, పన్నీర్ సెల్వం వర్గం నాయకులు అమ్మ జయలలిత సమాధి దగ్గరకు చేరుకుని ప్రత్యేక పూజలు చేసి అక్కడే విలీనం కావాలని సూచించారు. ఆసమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, భారీ సంఖ్యలో నాయకులు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది.
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి ఆదేశాల మేరకు మెరీనా బీచ్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని తెలిసింది. దాదాపు మూడు వేల మందికి పైగా పోలీసులు అక్కడ విధుల్లో ఉండాలని డీజీపీ సూచించారని తెలిసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి తంజావూరు జిల్లాలోని తిరువూరులో శనివారం సాయంత్రం జరుగుతున్న ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళ్లారు.
పన్నీర్, పళనిసామి చర్చలు విఫలం: ఈ డిమాండ్లకు క్లారిటీ లేదు, పన్నీర్ పట్టుతో సీఎంకు?
పన్నీర్ సెల్వం ఆదివారం రాత్రి మదురైలో జరుగుతున్న ఆయన వర్గంలోని నాయకుల సమావేశంలో పాల్గొనడానికి వెళ్లారు. సోమవారం మంచి ముహుర్తంలో పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు అమ్మ జయలలిత సమాధి దగ్గర కలుసుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.