ఏకాంతంలో ప్రేమికులు, అడ్డుపడిన మహిళ హత్య, నీ అక్రమ సంబంధం మాకు తెలుసు, లేదంటే!
చెన్నై: ప్రియుడితో ఏకాంతంగా గడిపిన విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతానని మందలించిన మహిళపై మైనర్ ప్రేమికులు కక్ష పెంచుకున్నారు. నువ్వు మాత్రం వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవచ్చని, మేము మాత్రం ఏకాంతంగా ఎందుకు గడపకూడదని మహిళతో గొడవ పెట్టుకున్న మైనర్ ప్రేమికులు తరువాత ఆమెను దారుణంగా హత్య చేశారు. మహిళను హత్య చేసిన యువతి ఇంటిలో ఏమీ తెలియనట్లు నాటకమాడింది. మహిళను హత్య చేసిన బాలుడు సైతం అక్కడి నుంచి పారిపోయి చివరికి తమిళనాడు పోలీసులకు చిక్కిపోయాడు.
ప్రాణం తీసిన అక్రమ సంబంధం, కాల్చి బూడిద చేసిన ప్రియురాలు, నేను సరిపోనా ? ఎంత మంది!
కొడైక్కెనాల్ దంపతులు
తమిళనాడులోకి కొడైక్కెనాల్ సమీపంలోని పణైక్కాడు ప్రాంతంలో కేశవన్, సుందరి (31) దంపతులు నివాసం ఉంటున్నారు. కేశవన్, సుందరి దంపతులకు 11 ఏళ్ల కుమార్తె ఉంది. నిత్యం కేశవన్, సుందరి దంపతుల మద్య మనస్పర్థలు కావడంతో మూడేళ్ల క్రితం వీరు విడిపోయారు. కేశవన్ దగ్గరకే ఆమె కుమార్తె ఉంటోంది.
సుందరి అక్రమ సంబంధం
సుందరికి పణైక్కాడు సమీపంలో నివాసం ఉంటున్న మురగన్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త కేశవన్, కుమార్తెకు దూరంగా ఉంటున్న సుందరి ప్రియుడు మురుగన్ తో కలిసి వేరే కాపురం పెట్టింది. మురుగన్ చెన్నైలో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చూస్తూ వీలైనప్పుడు సుందరి ఇంటికి వచ్చి వెలుతున్నాడు.
సుందరి ప్రాణం పోయింది
మురునగర్ చెన్నైలోనే ఉన్నాడు. ఇంటిలో ఓంటరిగా ఉంటున్న సుందరి ఈనెల 21వ తేదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చెన్నైలో ఉన్న మురుగన్ కు విషయం తెలియడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సుందరి అనుమానాస్పద మృతి కేసును అనేక కోణాల్లో విచారణ చేశారు.
సుందరి ఇంట్లో అమ్మాయి!
సుందరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రోజు ఆమె సమీప బంధువు (16) ఉందని పోలీసులు గుర్తించారు. సుందరి సమీప బంధువు 16 ఏళ్ల అమ్మాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోందని పోలీసులు అన్నారు. పోలీసులకు అనుమానం వచ్చి కాలేజ్ విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.
కాలేజ్ ప్రియుడితో ఏకాంతంగా
దిండుగల్ లోని తనతో పాటు చదువుతున్న 16 ఏళ్ల బాలుడు, తాను ప్రేమించుకున్నామని సుందరి బంధువుల అమ్మాయి పోలీసులకు చెప్పింది. సుందరి లేని సమయంలో తన ప్రియుడితో ఇదే ఇంటిలో ఏకాంతంగా గడుపుతున్నామని అమ్మాయి అంగీకరించింది.
అర్దరాత్రి రాసలీలలు
ఇటీవల తన ప్రియుడితో కలిసి అర్దరాత్రి ఏకాంతంగా, ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో ఆకస్మాత్తుగా సుందరి ఇంటిలోకి వచ్చిందని, తమను తీవ్రస్థాయిలో మందలించి ఈ విషయం మీ తల్లిదండ్రులకు చెబుతున్నానని హెచ్చరించిందని కాలేజ్ అమ్మాయి పోలీసులకు చెప్పింది. నువ్వు మాత్రం భర్తను వదిలేసి మురుగన్ తో జల్సాలు చేస్తున్నావని, నేను నా ప్రియుడితో ఏకాంతంగా గడిపితే తప్పేముందని సుందరితో గొడవ పెట్టుకున్నానని కాలేజ్ అమ్మాయి పోలీసులకు చెప్పింది.
భయంతో చంపేశారు
తల్లిదండ్రులకు ఎక్కడ విషయం చెబుతుందో అనే ఆందోళనతో సుందరిని తన ప్రియుడితో కలిసి చున్నీతో గొంతు నులిమి హత్య చేశామని కాలేజ్ అమ్మాయి పోలీసుల విచారణలో అంగీకరించింది. సుందరిని హత్య చేసిన తరువాత తన ప్రియుడు పారిపోయాడని, తాను అక్కడే ఉండి ఏమీ తెలియనట్లు నాటకం ఆడానని కాలేజ్ అమ్మాయి అంగీకరించిందని, సుందరీని హత్య చేసిన మైనర్ ప్రేమికులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.