ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఫ్రీగా 55లక్షల స్మార్ట్ ఫోన్స్ అందిస్తోంది!
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 55 లక్షల స్మార్ట్ ఫోన్లను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 55 లక్షల స్మార్ట్ ఫోన్లను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకానికి 'సంచార్ కాంత్రి యోజన' అని పేరు పెట్టారు.
రెండేళ్లలో రెండు దశల కింద ఈ పథకాన్ని అమలు చేస్తారు. తొలుత వేయికిపైగా జనాభా ఉన్న గ్రామాలు, పట్టణ పేదలు, కళాశాల విద్యార్థులకు 50.8 లక్షల ఫోన్లు అందజేస్తారు.
రెండో దశలో 4.8 లక్షల ఫోన్లను 1000 కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామాల వారికి ఇస్తామని పరిశ్రమ శాఖ మంత్రి అమర్ అగర్వాల్ తెలిపారు. ఇంట్లోని మహిళల పేరు మీదనే వీటిని ఇస్తారు.
అంతేగాక, వీటిని ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేస్తారు. ప్రభుత్వ భవనాలపై ఉచితంగా మొబైల్ టవర్లు పెట్టుకునేందుకు టెలికాం కంపెనీలకు అనుమతి ఇస్తారు.