చిదంబరం అరెస్ట్ కావడం శుభపరిణామం : ఇంద్రాణి ముఖర్జీ
ఐఎన్ఎక్స్ మీడీయా మాజీ ప్రమోటర్ ఇంద్రాణి ముఖర్జి మాజీ కేంద్రమంత్రి చిదంబరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో చిదంబరంను అరెస్ట్ చేయడం శుభపరిణామమని, ఆమే అభివర్ణించారు. ఆయన అరెస్ట్తో అన్ని విషయాలు బయలకు వస్తాయని చెప్పిన ఆమే, కార్తి చిదంబరానికి ఇచ్చిన బెయిల్ కూడ రద్దు చేయాల్సి ఉండేదని అన్నారు.... కాగా ఇంద్రాణి ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే.
అక్టోబర్ 2 నుంచి ఆరు రకాల ప్లాస్టిక్ వస్తువుల బ్యాన్.. విక్రయం, ఉత్పత్తి కూడా నిషేధమే...
ఐఎన్ఎక్స్ మీడీయా మాజీ ప్రమోటర్ అయినా ఇద్రాణి ముఖర్జికి చిదంబరంపై పీకల్లోతు ఆగ్రహంతో ఉన్నట్టుంది. అందుకే ఆయన అరెస్ట్ను శుభపరిణామంగా అభివర్ణించింది. ఇంద్రాణి ముఖర్జీ కూతురు షీనా బోరా హత్య కేసులో ట్రయల్స్లో భాగంగా సెషన్స్ కోర్టుకు హజరైన సంధర్భంగా ఇంద్రాణి ముఖర్జి సెన్సెషన్ కామెంట్స్ చేశారు. కాగా అంతకు ముందు ఐఎన్ఎక్స్ కేసులో ఇంద్రాణి ముఖర్జితోపాటు ఆమే భర్త పీటర్ ముఖర్జీలు కూడ అరెస్ట్ అయి అనంతరం బెయిల్పై విడుదల అయ్యారు.
ఈ నేపథ్యంలోనే ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపిబి) అనుమతి ఇవ్వడానికి బదులుగా తన కుమారుడు కార్తీ చిదంబరం తన వ్యాపారంలో సహాయం చేయాలని మరియు విదేశీ చెల్లింపులు చేయమని మాజీ కేంద్ర మంత్రి తనను కోరినట్లు ఆమె తన ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు 21న మనిలాండరింగ్ కేసులో చిదంబరం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.