వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయా రంగాల వృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలేవీ..!! 7 శాతం జీడీపీ ఎలా సాధ్యమని చిదంబరం ప్రశ్న

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఆర్థిక సర్వేపై విపక్ష కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. ఆయా రంగాలవారీగా వృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను వివరించలేదని మండిపడింది. ఆర్థిక వృద్ధి కూడా ఆశించిన స్థాయిలో లేదని .. రెవెన్యూ రాబడి పడిపోయిందని ఆరోపించింది. ఆర్థిక వనరులు ఎలా సమకూరుస్తారో తెలుపకుండా కేటాయింపులు ఎలా చేస్తారని ప్రశ్నించింది.

ఉద్యోగాలేవీ ?
ఆర్థిక సర్వేలో సానుకూల అంశాలేమీ లేవన్నారు మాజీ ఆర్థికమంత్రి పి చిదంబరం. యువతకు ఉద్యోగాలు, పెట్టుబడులు, వృద్ధి కోసం బీజేపీ సర్కార్ అనుసరించిన విధానాలు ఏంటని ప్రశ్నించారు. చిన్న పరిశ్రమల్లో ఉపాధి కల్పన కోసం తీసుకున్న చర్యలపై క్లారిటీ లేదని విమర్శించారు. అలాగే కొత్త ఉద్యోగాల సృష్టించేందుకు అనుసరించే విధానాలను తెలుపలేదని మండిపడ్డారు. దీనికి నిరుద్యోగితి పెరగడం సజీవ సాక్ష్యమని వివరించారు. గత 45 ఏళ్లలో 6.1 శాతానికి నిరుద్యోగిత చేరిందని గుర్తుచేశారు.

chidambaram criticized on economic survey

వాస్తవానికి నేషనల్ శాంపిల్ సర్వే ఎన్నికలకు ముందే ఈ వివరాలను సేకరించినా .. ప్రభుత్వం నిలిపివేయాలని సూచించడంతో ఆపేశారని తెలిపారు. మోడీ ప్రభుత్వం మరోసారి కొలువుదీరాక పాత చింతకాయ పచ్చడిలా నిరుద్యోగితను అధికారికంగా ప్రకటించారని పేర్కొన్నారు. 2019 జూన్ 25నాటికి నిరుద్యోగితి 8.1 శాతానికి చేరిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలుపడం ఆందోళన కలిగిస్తోందన్నారు చిదంబరం.మోడీ ప్రభుత్వ విధానాలతో ఉపాధి కరవవుతోందని గుర్తుచేశారు. దేశంలో 3.7 కోట్ల మంది తమ ఉపాధిని కోల్పోతున్నారనే కఠోర సత్యాన్ని తెలిపారు. ఇందులో 3 కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఉండటం ఆందోళన కలిగిస్తుందని గుర్తుచేశారు.

కనిష్టానికి చేరిన అభివృద్ధి ..
జీడీపీ 7 శాతం ఉంటుందని ఆర్థికసర్వేలో అంచనా వేశారు. ఏ ప్రతిపాదికన కింద చేశారో వివరించలేదని మండిపడ్డారు. అంతేకాదు గత ఐదేళ్లలో ఆర్థికవృద్ధి కనిష్టానికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. 8.0, 7.0, 6.6, 5.8గా వృద్ధి రేటు ఉందని తెలిపారు. 10 నెలలుగా ఆటోమొబైల్ రంగం క్షీణిస్తుందని .. అయినా మోడీ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టలేదని వివరించారు.

English summary
Economic Survey 2018-19 exposes BJP’s hyperbole on Economy! No Jobs, No Investment, No Growth - are 3 Tiers on which BJP’s Economic Mismanagement rests. The Economic Survey 2018-19 tabled in the Parliament today is truer than the multiple tall claims of the BJP Government, even though it attempts to whitewash the massive failures and gross economic mismanagement of the BJP Govt in the past 5 years. Economic Survey 2019 is pessimistic about the economy and makes a feeble attempt to wake up the ruling party from its deep slumber of inaction on the economic front.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X