వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరంను కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ: 5 రోజుల కస్టడీ ఇవ్వాలంటూ వాదన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరంను గురువారం మధ్యాహ్నం సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టింది. గురువారం నాలుగు గంటలపాటు చిదంబరంను సీబీఐ విచారించినట్లు సమాచారం. ఆ తర్వాతనే కోర్టులో ప్రవేశపెట్టింది.

<strong>క్వైట్&డిటర్మైన్డ్ ఆఫీసర్: చిదంబరం ఇంటి గోడ దూకిన సీబీఐ అధికారి ఎవరో తెలుసా?</strong>క్వైట్&డిటర్మైన్డ్ ఆఫీసర్: చిదంబరం ఇంటి గోడ దూకిన సీబీఐ అధికారి ఎవరో తెలుసా?

సుదీర్ఘమైన కేసు కావడంతో మరిన్ని వివరాలు రాబట్టేందుకు తమకు మరింత సమయం కావాలని, అందుకు చిదంబరంను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ.. కోర్టులో వాదనలు వినిపిస్తోంది. ఈ కేసులో చిదంబరంపై బలమైన అభియోగాలున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీబీఐ తరపున వాదించారు.

 Chidambaram Produced in Court, CBI Seeks 5-da

ఇక చిదంబరం తరపు న్యాయవాదులు మాత్రం కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదనే విధంగా వాదనలు వినిపిస్తున్నట్లు సమాచారం. చిదంబరం, కార్తీ చిదంబరం తరపున కాంగ్రెస్ నేతలు, న్యాయవాదులైన కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీ, వివేక్ తంఖాలు వాదనలు వినిపిస్తున్నారు.

కాగా, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది ఇలాఉండగా, కోర్టు రూంలో కార్తీ చిదంబరం భార్య నళిని, ఇతర కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. దయన్ కృష్ణన్ తోపాటు ఇతర సీనియర్ న్యాయవాదులు కూడా కోర్టు రూంలో ఉన్నారు.

English summary
Former Finance Minister P Chidambaram, who was arrested by the CBI Wednesday night from his residence in connection with INX media corruption case amid high drama, will be produced in a special CBI court today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X