రియల్ సీఎం...కాన్యాయ్ ఆపీ..పౌరుని దగ్గరకు వెళ్లిన గోవా సీఎం... వీడీయో
రాష్ట్ర్రాల ముఖ్యమంత్రులంటే పరిపాలన పరమైన విధానాలను నిర్ణయించడం వాటిని అమలు అయ్యోలా చూడడం... కాని గోవా సీఎం మాత్రం విధానాలను రూపోందించి చట్టాలు చేయడమే కాదు..వాటిని అమలు పరిచే ప్రయత్నాలు కూడ చేశాడు. ఈనేపథ్యంలోనే నదిలో చెత్త వేస్తున్న ఓ వ్యక్తిని గమనించిన సీఎం ఏకంగ తన కాన్వాయ్ని ఆపి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లాడు. అనంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు వాటిని కాపాడుకోవాలని సదరు వ్యక్తికి సూచించాడు. రాష్ట్ర్ర్రానికి సిఎంగా కాకుండా ఓ పౌరునిగా సీఎం ఓ వ్యక్తికి హితవు పలికాడు.
ఆంధ్రా సీఎం జగన్ మోహన్ కు ధైర్యం ఎక్కువ, యువతకు ఆదర్శం, కర్ణాటక సీఎం కొడుకు కితాబు !
గోవా రాష్ట్ర్రం అనగానే ముఖ్యంగా పర్యాటక రాష్ట్ర్ర్రంగా చెప్పుకోవచ్చు. గోవాలో పర్యటక రంగం ద్వారనే ఆ రాష్ట్ర్ర ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తుంది. అలాంటీ ప్రాంతాన్ని ప్రతి పౌరుడు కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి పౌరుడిపై ఉంది. కాని ఈబాధ్యతను విస్మరించిన వ్యక్తిని గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్వయంగా వారించాడు. ఈ నేపథ్యంలోనే గోవాలోని కంభుర్జువా నదిలో ఓ వ్యక్తి చెత్తను పారవేస్తున్న దృశ్యాన్ని కాన్వాయ్లో వెళుతున్న సీఎం గమనించాడు. దీంతో ఆయన వెంటనే తన కారు డ్రైవర్ను వెనక్కి తిప్పాలని చెప్పాుడు. అనంతరం నదిలో చెత్త వేసిన వ్యక్తి దగ్గరకు స్వయంగా వెళ్లాడు సీఎం. చెత్తను వేయవద్దని చెప్పాడు. ఇలాంటీ సంఘటనలు పునరావృతం కావద్దని సదరు వ్యక్తికి చెప్పాడు. భాద్యత గల పౌరులుగా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని చెప్పాడు.
ఇక ఇదే విషయాన్ని సీఎం ప్రమోద్ సావంత్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దీంతో సీఎంకు ఉన్న చిత్తశుద్దిపై పలువురు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఆ ట్వీట్ వైరల్ అవుతుంది. ఏకంగా సీఎం పౌరులు చేస్తున్న పనిని చూస్తూ ఊరుకోకుండా స్వయంగా కారు దిగి వచ్చి వారించడం చాల మందికి సాధ్యం కాదు కాదా...అందుకే గోవా సీఎం చేసిన మంచి పనిని అందరు అభినందిస్తున్నారు.
Earlier today, while travelling over Gaundalim bridge, came across a citizen who was disposing nirmalya in the river. I requested him to desist from doing so. As responsible citizens we need to begin disposing wastes properly and also educate & guide our fellow citizens to do so. pic.twitter.com/v2zSLCCkxe
— Dr. Pramod Sawant (@DrPramodPSawant) June 11, 2019