బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరం: ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: బాల్య వివాహం అనేది అత్యాచారం కంటే అత్యంత దారుణమైనదని, దీన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవరసం ఉందని ఢిల్లీ కోర్టు పేర్కొంది. ఓ భాలికపై వరకట్న వేధింపుల కేసును మెట్రోపాలిటన్ కోర్టు విచారించింది. బాల్య వివహం చేయడంతో పాటు కట్నమిచ్చిపుచ్చుకున్నందుకు బాలికి తల్లిదండ్రులు, అత్తింటివారిపై కేసు పెట్టాలని మేజిస్ట్రేట్ శివాని చౌహాన్ పోలీసులను ఆదేశించారు.
తమ కూతురికి చిన్నతనంలోనే ఆమెకు వివాహం చేసిన తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయాలన్నారు. చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల తమ విద్యను కొనసాగించలేక పోతారు. శారీరక హింసలకు, హెచ్ఐవీ వంటి వ్యాధులకు గరవుతారు. గర్బవతులైనప్పుడో, కాన్పు సమయంలోనో తరచు మరణిస్తుంటారు అని మేజిస్ట్రేట్ శివాని చౌహాన్ పేర్కొన్నారు.
బాల్య వివాహము అంటే యుక్త వయసు రాక ముందు బాల్య దశలో చేసే వివాహము. నేడు చట్ట ప్రకారము 18 సంవత్సరాల వయసు నిండని అమ్మాయికి, మరియు 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి జరిగే వివాహమును బాల్య వివాహముగా చెప్పవచ్చు. పూర్వ కాలంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి.
ఫ్రెంచివారు, పోర్చుగీసు వారు, డచ్ వారు, బ్రిటీషు వారు మొదలైన విదేశీయులు భారతదేశాన్ని పాలించు కాలంలో కొంతమంది విదేశీ అధికారులు భారతీయ కన్యలను బలవంతంగా వివాహమాడేవారు లేదా చెరచేవారు. దీంతో వారి భారి నుండి తమ పిల్లలను రక్షించుకునేందుగాను తమ పిల్లలకు బాల్యంలోనే వివాహం చేసేవారు.