మారని చైనా తీరు.. ఈ సారి నేపాల్ భూభాగంపై కన్ను.. కేంద్రాన్ని అలర్ట్ చేసిన ఐబీ..
డ్రాగన్ చైనా తీరు మారడం లేదు. దుందుకుడు చర్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటోంది. అయితే ఈ సారి నేపాల్ భూభాగాన్ని ఆక్రమించుకొంది. ఏడు సరిహద్దు జిల్లాల్లో గల ప్రాంతాలను ఆక్రమించింది. దీంతో భారత నిఘా విభాగం భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. చైనా వేగంగా భూమి ఆక్రమించుకుంటూ వస్తోందని ఐబీ తెలిపింది. చైనాతో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ సన్నిహితంగా ఉంటోంది. దీంతో తమ పని మరింత సులువు చేసుకునేందుకు డ్రాగన్ పన్నాగం పన్నుతోంది.
Recommended Video
డొలాకా, గోర్కా, దార్చులా, హుమ్లా, సింధూపాల్ చౌక్, శంఖువసబా, రసువా జిల్లాల్లో చైనా పాగా వేసింది. డొలాకా జిల్లా వద్ద అంతర్జాతీయ సరిహద్దు 1500 మీటర్లు దాటి చైనా ముందుకొచ్చింది. పిల్లర్ 57 గుండా వచ్చింది. గోరఖా జిల్లాలో గల పిల్లర్ నంబర్ 35, 37, 38, 62 రీ లొకెట్ చేసింది. మొదటి మూడు పిల్లర్లు రువి జిల్లాలో ఉన్నాయి.
వాస్తవానికి ఈ భూభాగం నేపాల్లో ఉంది. దీంతో అక్కడివారు నేపాల్ ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు. అయితే 2017లో ఈ ప్రాంతాన్ని చైనా అక్రమించింది. టిబెట్లో విలీనం చేసింది. నేపాల్లో ఉండే చాలా ఇళ్లను చైనా స్వాధీనం చేసుకుంది. అయితే చైనా దుందుకుడు చర్యలపై ఐబీ అలర్టయ్యింది. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది.