కారణమిదే: డోక్లామ్పై పట్టుసడలిస్తున్న చైనా
డోక్లామ్ విషయంలో పట్టువిడుపుల దిశగా చైనా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. గురు, శుక్రవారాల్లో భారత్ జాతీయ భద్రతా సలహదారు అజిత్ధోవల్ చైనా రాయబారులతో సమావేశం కానున్నారు.
బీజింగ్: డోక్లామ్ విషయంలో పట్టువిడుపుల దిశగా చైనా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. గురు, శుక్రవారాల్లో భారత్ జాతీయ భద్రతా సలహదారు అజిత్ధోవల్ చైనా రాయబారులతో సమావేశం కానున్నారు.
భారత్తో యుద్దానికి అమెరికానే కారణం: చైనా
గురువారం బ్రిక్స్ సమావేశంలో కూడ ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత భద్రతా విషయాలపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పలువురు నాయకులను కలుస్తారు.
అయితే జిన్పింగ్తో జరిగే సమావేశానికి మిగతా బ్రిక్స్ దేశాల భద్రతా సలహదారులు కూడ హజరుకానున్నారు. డోక్లామ్లో ఉద్రిక్తతలపై చైనా స్టేట్ కౌన్సిలర్ సరిహద్దు భద్రతా సలహదారు యాంగ్జిచీతో ప్రత్యేకంగా భేటీ అవుతారు.
ధోవల్ పర్యటన సందర్భంగా చైనా మీడియా ప్రధానమంత్రి మోడీని పొగుడుతూ ఆశ్చర్యకరమైన కామెంట్లు చేసింది.మోదీ ఆర్థిక ప్రగతిశీలురని, ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు వర్థిల్లాలంటూ జిన్హువా న్యూస్ పేర్కొంది. తమ వస్తువులకు కీలక మార్కెట్గా ఉన్న భారత్తో గొడవపడేందుకు చైనా ప్రభుత్వం సుముఖంగా లేదని ఆ దేశ మీడియా రూట్ మార్చినట్టు ప్రచారం సాగుతోంది.