కోవిడ్-19 కేర్ సెంటర్గా చిన్నస్వామి క్రికెట్ స్టేడియం, బెంగళూరు ప్యాలెస్ కూడా.. 600 అంబులెన్స్లు..
ఐటీ హబ్ కర్ణాటకలోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 28 వేల 877 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది. ఇందులో 16 వేల 531 మంది వివిధ ఆస్పత్రులు/హోం క్వారంటైన్లో ఉన్నారు. 11 వేల 876 మందికి వైరస్ తగ్గడంతో.. ఇంటికి పంపించారు. వైరస్ సోకి 470 మంది చనిపోయారు. ముఖ్యంగా బెంగళూరులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి.
పాజిటివ్ కేసులు రావడంతో అందుకు తగ్గట్టుగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎం చిన్నస్వామి క్రికెట్ స్టేడియాన్ని కోవిడ్-19 కేర్ సెంటర్గా మారుస్తున్నారు. దీంతోపాటు బెంగళూర్ ప్యాలెస్ కూడా మారుస్తున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదివరకు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ కూడా కోవిడ్-19 కేంద్రంగా మార్చిన సంగతి తెలిసిందే. సిటీలో పాజిటివ్ కేసులు పెరగడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు.
Recommended Video
బెంగళూరు ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని కోవిడ్ -19 ఇంచార్జీ ఆర్ అశోక తెలిపారు. నగరంలో అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. కరోనా వైరస్ రోగుల కోసం నగరంలో 600 అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.