బీజేపీ యువ ఎంపీ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం... గాల్లోనే చక్కర్లు...వీడియో
విమానంలో ప్రయాణం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పోవాల్సిన పరిస్థితి గాల్లోకి ఎగిరిన తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి..ఇలా టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయిన విమానాలు ఎన్నో ఉన్నాయి..వీటికి తోడు ఎన్నో విమానాలు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న విమానాలు కూడ ఉన్నాయి....ఇలా ప్రాణపాయం నుండి ఓ ఎంపీ తప్పించుకున్నాడు..అయితే టేకాఫ్ సంధర్భంలో తీసీన వీడీయో సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది.
రాజస్థాన్లో బీజేపీకి నేత ఎంపీ మహంత్ బాలక్ నాథ్ ప్రయాణిస్తున్న విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఆల్వార్ను నుండి మరో ప్రాంతానికి వెళ్లేందుకు విమానం టేకాఫ్ అయింది. వెంటనే అదుపు తప్పి గాల్లోనే పలు రౌండ్లు గిరగిర తిరిగింది.దీంతో అక్కడున్న ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు..అయితే అలా గాల్లోనే మూడు సార్లు చక్కర్లు కొట్టిన ఫ్లైట్ అనంతరం అదుపులోకి వచ్చింది...దీంతో చోట చక్కర్లు కొడుతుండడం పలువురుని ఆశ్చార్యానికి గురిచేసింది..ఏది ఏమైనప్పటికి విమానం అదుపులోకి రావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
#WATCH Alwar: Chopper with Alwar BJP MP Mahant Balaknath onboard appeared to have lost control but regained it later and flew off. #Rajasthan pic.twitter.com/aIHaIHTMuh
— ANI (@ANI) June 30, 2019
35 ఏళ్ల మహంత్ బాలక్ నాథ్ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో భాజపా తరఫున అల్వార్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 7.6 లక్షల ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భన్వర్ జితేంద్ర సింగ్పై ఆయన మూడు లక్షలకుపైగా ఓట్ల మెజార్టీ ఓట్లతో గెలుపొందారు.