నాలుగేళ్ల చిన్నారిపై సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్, చాక్లెట్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి, వివస్త్రను చేసి..
ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ వక్రబుద్ధి చూపించాడు. తన కొలిగ్ కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. నాలుగున్నరేళ్ల చిన్నారి అని కూడా చూడలేదు. చాక్లెట్ పేరుతో మభ్యపెట్టి వివస్త్రను చేశాడు. ఒడిశాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
హెడ్ కానిస్టేబుల్ కందస్వామి..
జగత్సింగ్పూర్ జిల్లా ప్యారదీప్లో ఎం కందస్వామి (48) సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీలో అతను విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడే గల క్వార్టర్లో ఉంటూ డ్యూటీ చేస్తున్నాడు. అయితే తన కోలిగ్ కూతురితో మాత్రం అసభ్యంగా ప్రవర్తించాడు. నాలుగున్నరేళ్ల చిన్నారి అని కూడా చూడకుండా మిస్ బిహేవ్ చేశారు.
చాక్లెట్ ఇస్తానని చెప్పి
ఇటీవల చిన్నారిని కందస్వామిని ఇంటికి తీసుకెళ్తున్నాడు. చాక్లెట్ ఇస్తానని చెప్పి మభ్యపెడుతున్నాడు. అలా ఇంటికి తీసుకెళ్లి.. చాక్లెట్ ఇస్తున్నాడు. చాక్లెట్ ఇచ్చాక.. తన బట్టలు విప్పేస్తున్నాడని, చిన్నారి డ్రెస్ కూడా విప్పుతున్నాడు. కూతురుకు వరసగా చాక్లెట్లు ఇస్తూ ఇంటికి పిలవడంతో తల్లికి అనుమానం వచ్చింది. ఇంటికొచ్చిన చిన్నారిని ఏం జరుగుతోందని ప్రశ్నించింది. దీంతో జరిగిన ఘటనను పూసగుచ్చినట్టు తన తల్లికి చిన్నారి తెలిపింది. తల్లి ఒక్కసారిగా షాక్ తిన్నారు.
పోక్సో కింద కేసు
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కందస్వామిని అరెస్ట్ చేశారు. అతనిపై ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసనట్టు వివరించారు. స్థానికంగా మాత్రం ఘటన కలకలం రేపింది. పసిపాపతో హెడ్ కానిస్టేబుల్ ప్రవర్తన చూసి క్వార్టర్లో ఉంటోన్న మిగతావారు భయాందోళనకు గురవుతున్నారు. మన చుట్టూ ఉండే ప్రజలు కూడా ఇలా ఉంటున్నారా అని ఆశ్చర్యపోతున్నారు.