For Daily Alerts
ముకేష్ అంబానీ నివాసం వద్ద తుపాకీతో కాల్చుకుని సీఐఎస్ఎఫ్ జవాను ఆత్మహత్య
ముంబై: విధి నిర్వహణలో ఉన్న ఓ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) జవాను తన తుపాకీతో తనని తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ఉన్నతాధికారులు తెలిపారు.
దక్షిణ ముంబైలోని భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ నివాసం అంటిలియా వద్ద విధులు నిర్వహిస్తున్నారు ఈ జవాను. ఈ క్రమంలో బుధవారం అతడు తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ముంబై నగరంలోని జేజే ఆస్పత్రిలో ఆ జవాను మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు గురువారం పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
English summary
Ajawan of the Central Industrial Security Force (CISF) allegedly shot himself while on duty in Mumbai, police officials said.