మరో డీమానిటైజేషన్గా మారనున్న పౌరసత్వ బిల్లు : ప్రశాంత్ క్రిషోర్
కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లు వివాదం రోజురోజుకు చెలరేగుతోంది. బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన నిరసలు ఉత్తరాధి రాష్ట్రాలకు కూడ పాకాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో పౌరసత్వ బిల్లుపై అందోళనలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలోనే పౌరసత్వ బిల్లుపై మొదటి నుండి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ ప్రచార వ్యూహకర్త , జేడీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ మరోసారి ఫైర్ అయ్యారు.
కేంద్రం తీసుకువచ్చిన ఎన్ఆర్సీ బిల్లును మరో డీమానిటైజేషన్తో ఆయన పోల్చారు. ఎన్ఆర్సీ అనేది సిటిజిన్షఇప్ డీమానిటైజేషన్ అంటూ... నువ్వు దేశ పౌరుడివో కాదో అని నిరూపించుకునేంత వరకు నీ పౌరసత్వం చెల్లుబాటు కాదు అని పేర్కొన్నారు. ఈ బిల్లువల్ల ఎక్కువగా నష్టపోయోది, పేద మరియు మధ్యతరగతి వర్గాల ప్రజలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో జరిగిన అనుభవాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయని అన్నారు. ఇక పౌరసత్వ బిల్లును సమర్థిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు వ్యతిరేకిస్తున్న ప్రశాంత్ కిషోర్ మధ్య ఇదే అంశంపై కూడ చర్చ కొనసాగుతోంది. దీంతో ప్రశాంత్ కిషోర్ పార్టీకి రాజీనామా కూడ చేసిన విషయం తెలిసిందే...
మరోవైపు పౌరసత్వ బిల్లుపై వెల్లువెత్తుతున్న నిరసనలతో కేంద్రం దిగివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిల్లును వ్యతిరేకిస్తున్న వర్గాలతో చర్చించి దాని సవరణను సైతం చేపేందుకు అమిత్ షాతోపాటు ప్రధాని సన్నద్దమవుతున్నట్టు సమాచారం.