రాజ్యసభలో అమోదం పొందిన పౌరసత్వ బిల్లు..అనుకూలంగా 125, వ్యతిరేకంగా 105 ఓట్లు
పౌరసత్వ బిల్లుకు రాజ్యసభ అమోదం తెలిపేందుకు సిద్దమయ్యింది. ఇందుకోసం పలు సవరణలపై ఒటింగ్ నిర్వహించారు. దీంతో అనుకూలంగా 125 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 105 ఓట్లు పోలయ్యాయి. కాగా అంతకుముందు బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని ఓటింగ్ జరగడంతో.... దీంతో బిల్లును సెలక్ట్ కమిటికి పంపించాలని కోరుతూ.
92 ఓట్లు నమోదు కాగా , సెలక్ట్ కమిటీకి పంపిచాల్సిన అవసరం లేదని 113 ఓట్లు పడ్డాయి. దీంతో బిల్లుపై వచ్చిన 14 సవరణలపై చదివిన రాజ్యసభ చైర్మణ్ వెంకయ్య నాయుడు అనంతరం వాటిని మూవ్ చేస్తూ... పాస్ చేశారు. ఇక సవరణలు పూర్తయినన తర్వాత బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు. దీంతో మెజారిటీ సభ్యులు బిల్లుకు అమోదం తెలపడంతో పౌరసత్వ సవరణ బిల్లు ఉభయ సభల్లో అమోదం పోందినట్టయింది.
కాగా బిల్లుకు లోక్సభలో బిల్లుకు మద్దతు ఇచ్చిన శివసేన ఎంపీలు రాజ్యసభలో యూటర్న్ తీసుకున్నారు. బిల్లుకు మద్దతు పలకుండా.. సభ నుండి వాకౌంట్ చేస్తూ.. బయటకు వచ్చారు. కాగా ఓటింగ్ సమయంలో అనేక సవరణలకు చేసిన తర్వాత ఓటింగ్కు వెళ్లారు. కాగా లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు రాగ 80 ఓట్లు వ్యతిరేకంగా వచ్చిన విషయం తెలిసిందే...