వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ ‘కిలేడీ’ మాయ!: ఐపీఎస్ అధికారిణిగా నమ్మించి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిని పెళ్లిచేసుకుని..

కేరళలో ఓ ‘కిలేడీ’ఘరానా మోసం వెలుగుచూసింది. తనని తాను ఐపీఎస్‌ అధికారిణిగా చెప్పుకుంటూ ఓ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగిని నమ్మించి ఏకంగా పెళ్లి చేసుకుందామె.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

కొట్టాయం: కేరళలో ఓ 'కిలేడీ'ఘరానా మోసం వెలుగుచూసింది. తనని తాను ఐపీఎస్‌ అధికారిణిగా చెప్పుకుంటూ ఓ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగిని నమ్మించి ఏకంగా పెళ్లి చేసుకుందామె.

అంతకు ముందు ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువకుడి దగ్గర డబ్బు తీసుకుని మోసం చేసింది. ఆ నిరుద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ 'కిలేడీ' మోసాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు ఆ మాయలేడీని అదుపులోకి తీసుకున్నారు.

తన భార్యతో బెడ్రూంలో స్నేహితుడు.. భర్త ఏం చేశాడో తెలుసా?తన భార్యతో బెడ్రూంలో స్నేహితుడు.. భర్త ఏం చేశాడో తెలుసా?

షాకింగ్: రెండు నాలుకల సుందరి! సోషల్ మీడియాలో వైరల్ (వీడియో)షాకింగ్: రెండు నాలుకల సుందరి! సోషల్ మీడియాలో వైరల్ (వీడియో)

వివరాల్లోకి వెళితే... కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన అఖిల్ మనోహర్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి. అతనికి అశ్రిత అనే యువతి పరిచయమైంది. తమిళనాడు కేడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్‌గా అశ్రిత(24) తనను తాను పరిచయం చేసుకుంది.

Claiming to be an IPS officer, newly wed Kerala woman lands in police net for cheating

ఆమెను నిజంగానే ఐపీఎస్ ఆఫీసర్ గా నమ్మి, ఇష్టపడి అఖిల్ మనోహర్ వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ వివాహమై కేవలం నెల రోజులు దాటింది అంతే. కాపురం సాఫీగా సాగిపోతున్న తరుణంలో తన భార్య ఘరానా మోసగత్తె అని అఖిల్ మనోహర్‌కు తెలిసింది.

గతంలో పలక్కడ్‌కు చెందిన సంతి అనే యువకుడి పొరుగింట్లో అశ్రిత నివాసముండేది. అశ్రిత ఐపీఎస్ ఆఫీసర్ అని సంతి కూడా నమ్మేశాడు. అతడికి డ్రైవర్ కమ్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇస్తానని చెప్పి అశ్రిత అతడి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసింది.

ఆ డబ్బు తీసుకున్న తర్వాత ఆమె పత్తా లేకుండా పోవడంతో సంతి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆమె కోసం గాలించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అఖిల్ మనోహర్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే అశ్రితను అదుపులోకి తీసుకున్నారు.

తమిళనాడు విజిలెన్స్ శాఖలో పనిచేస్తున్నట్లుగా చెప్పుకుంటూ చలామణీ అవుతున్న అశ్రిత కనీసం వీధి బడి చదువు కూడా పూర్తి చేయలేదని తెలుసుకున్న పోలీసులు కంగుతిన్నారు. గతంలో కూడా ఆమె ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

English summary
Marriages are made in heaven they say but this one seems to have fizzled out rather abruptly. This couple in Kerala lived happily for all of 38 days, before the groom’s family came to know that the bride was cheating them. Ashitha M (24) claimed that she was an IPS officer with Tamil Nadu cadre at the time of her marriage to Akhil Manohar, who is an Air Force official. On Thursday, a young man Santi from Palakkad, Kumaranelloor visited Ashitha at her husband’s house in Vaikom of Kottayam district, claiming that she had duped him of Rs 3 lakh after promising him a job. This is when Akhil’s family felt something was amiss and decided to file a complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X