ఓ ‘కిలేడీ’ మాయ!: ఐపీఎస్ అధికారిణిగా నమ్మించి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిని పెళ్లిచేసుకుని..
కేరళలో ఓ ‘కిలేడీ’ఘరానా మోసం వెలుగుచూసింది. తనని తాను ఐపీఎస్ అధికారిణిగా చెప్పుకుంటూ ఓ ఎయిర్ఫోర్స్ ఉద్యోగిని నమ్మించి ఏకంగా పెళ్లి చేసుకుందామె.
కొట్టాయం: కేరళలో ఓ 'కిలేడీ'ఘరానా మోసం వెలుగుచూసింది. తనని తాను ఐపీఎస్ అధికారిణిగా చెప్పుకుంటూ ఓ ఎయిర్ఫోర్స్ ఉద్యోగిని నమ్మించి ఏకంగా పెళ్లి చేసుకుందామె.
అంతకు ముందు ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువకుడి దగ్గర డబ్బు తీసుకుని మోసం చేసింది. ఆ నిరుద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ 'కిలేడీ' మోసాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు ఆ మాయలేడీని అదుపులోకి తీసుకున్నారు.
తన భార్యతో బెడ్రూంలో స్నేహితుడు.. భర్త ఏం చేశాడో తెలుసా?
షాకింగ్: రెండు నాలుకల సుందరి! సోషల్ మీడియాలో వైరల్ (వీడియో)
వివరాల్లోకి వెళితే... కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన అఖిల్ మనోహర్ ఎయిర్ఫోర్స్ ఉద్యోగి. అతనికి అశ్రిత అనే యువతి పరిచయమైంది. తమిళనాడు కేడర్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్గా అశ్రిత(24) తనను తాను పరిచయం చేసుకుంది.
ఆమెను నిజంగానే ఐపీఎస్ ఆఫీసర్ గా నమ్మి, ఇష్టపడి అఖిల్ మనోహర్ వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ వివాహమై కేవలం నెల రోజులు దాటింది అంతే. కాపురం సాఫీగా సాగిపోతున్న తరుణంలో తన భార్య ఘరానా మోసగత్తె అని అఖిల్ మనోహర్కు తెలిసింది.
గతంలో పలక్కడ్కు చెందిన సంతి అనే యువకుడి పొరుగింట్లో అశ్రిత నివాసముండేది. అశ్రిత ఐపీఎస్ ఆఫీసర్ అని సంతి కూడా నమ్మేశాడు. అతడికి డ్రైవర్ కమ్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇస్తానని చెప్పి అశ్రిత అతడి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసింది.
ఆ డబ్బు తీసుకున్న తర్వాత ఆమె పత్తా లేకుండా పోవడంతో సంతి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆమె కోసం గాలించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అఖిల్ మనోహర్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే అశ్రితను అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడు విజిలెన్స్ శాఖలో పనిచేస్తున్నట్లుగా చెప్పుకుంటూ చలామణీ అవుతున్న అశ్రిత కనీసం వీధి బడి చదువు కూడా పూర్తి చేయలేదని తెలుసుకున్న పోలీసులు కంగుతిన్నారు. గతంలో కూడా ఆమె ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.