నడిరోడ్డుపై కత్తులు దూసుకున్న విద్యార్థులు...! ఎక్కడో తెలుసా...
టీనేజీ వయస్సులో యువకులు కొంతమంది యువకులు ఎప్పుడు ఏం చేస్తారో వారికే తెలియదు. యుక్త వయస్సులో తమకు తోచిందే చేసే గుణం ఉంటుంది. అలాంటీ సమయంలోనే కాలేజీలోకి ఎంటర్ అవుతారు. అప్పుడే రెక్కలు వచ్చిన పక్షివలే స్వేఛ్చగా కాలేజీలో అడుగు పెట్టి ఇక తనకు ఎవరు ఎదురు లేరన్నట్టుగా వ్యవహరిస్తాడు.
ఇంతకి ఇదంతా ఎందుకంటే తమిళనాడులోని కాలేజీ విద్యార్థులు నడిరోడ్డుపైనే కత్తులు దూసుకున్నారు. తాము రోడ్డుపై ఏం చేస్తున్నామో తెలియని మైకంలో నడి రోడ్డుపై హంగామా సృష్టించారు. ఈనేపథ్యంలోనే కాలేజీ బస్సునే నడిరోడ్డుపై ఆపి రెండు వర్గాల విద్యార్థులు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇందులో భాగంగానే ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై కత్తితో కూడ దాడి చేసిన ఘటన చెన్నైలోని ఆరుంబక్కం లో జరిగింది..
ఇక ఇంత జరుగుతున్నా బస్సు డ్రైవర్ కూడ బస్సును ఎందుకు అపాడో తెలియని పరిస్థితి నెలకోంది. బస్సు డ్రైవర్తోపాటు రోడ్డు వెంట వెళ్లే స్థానిక ప్రజలు కూడ విద్యార్థుల ఆగడాలను అడ్డుకోని పరిస్థితి కనిపించింది. కాగా రెండు గ్రూపుల మధ్య ఘర్షణకు కారణమేమిటి అనేది తెలియాల్సి ఉంది.