భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు: రెండు వైపులా భద్రతా సిబ్బందికి గాయాలు
చైనా-భారత్ భద్రతా బలగాలు వివాదాస్పద సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలకు దిగినట్లు భారత మీడియా వార్తలు ప్రచురించింది. రెండు వైపులా భద్రతా సిబ్బంది గాయపడినట్లు పేర్కొంది.
ఉత్తర సిక్కింలో మూడు రోజుల క్రితం ఈ ఘర్షణలు చోటుచేసుకున్నట్లు సమాచారం.
లద్దాఖ్లోని వివాదాస్పద ప్రాంతంలో ఘర్షణల అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే.
గత ఏడాది జూన్లో లద్దాఖ్లోని గాల్వన్ లోయలో చోటుచేసుకున్న ఈ ఘర్షణల్లో 20మంది భారత సైనికులు మరణించారు. వీటిలో మరణించిన చైనా సిబ్బందిపై ఎలాంటి సమాచారం లేదు.
తాజాగా సిక్కింలోని నకులా పాస్ దగ్గర ఘర్షణలు చోటుచేసుకున్నట్లు సైనిక అధికారుల సమాచారం.
భారత ప్రాంతాల్లోకి గస్తీ కాస్తున్న చైనా బృందం ప్రవేశించేందుకు ప్రయత్నించిందని, వారిని బలవంతంగా వెనక్కి పంపించామని అధికారులు తెలిపారు.
'అన్నీ సర్దుకున్నాయి.. మీడియా సంయమనం పాటించాలి’
'సిక్కిం సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణకు సంబంధించి మాకు చాలా ప్రశ్నలొస్తున్నాయి.
సిక్కిం ఉత్తర ప్రాంతంలోని నకులా ప్రాంతంలో ఈ ఏడాది జనవరి 20న రెండు దేశాల సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ తలెత్తింది.
ప్రోటోకాల్స్ ప్రకారం స్థానిక కమాండర్ల మధ్య చర్చలతోనే ఆ సమస్య పరిష్కారమైపోయింది.
అవాస్తవాలు రాయకుండా మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నాం'' అని ప్రభుత్వ, సైనిక వర్గాలు చెప్పాయి.
కాగా ఈ అంశంపై చైనా వైపు నుంచి ఇంకా స్పందన లేదు.
భూటాన్, నేపాల్, చైనాల కూడలిలో సిక్కిం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- BBC ISWOTY : రతన్బాలా దేవీ.. భారత ఫుట్బాల్ జట్టుకు ఊపిరి
- కోవిడ్-19: సింగిల్ డోస్ వ్యాక్సీన్ ఎంత వరకు పని చేస్తుంది ? రెండో డోస్ తీసుకోకపోతే ఏమవుతుంది ?
- 'వాయిదా కాదు.. రద్దు చేయాలి.. ఉద్యమం అప్పుడే అయిపోలేదు’.. వ్యవసాయ చట్టాలపై రైతు నాయకులు
- సేఠ్ ఆబిద్: బంగారం స్మగ్లింగ్లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- లీసా మోంట్గోమేరీ: 67 ఏళ్ల తరువాత తొలిసారిగా ఒక మహిళకు మరణ శిక్ష అమలు చేసిన అమెరికా
- కరోనావైరస్: భారత్లో జనవరి 16 నుంచి కోవిడ్-19 వ్యాక్సినేషన్... ఎలా చేస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- రైతుల నిరసనలు: సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని ఆ నలుగురు ఎవరు?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)