ఔరంగబాద్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ, ఒకరు మృతి, 40 మందికి గాయాలు
ముంబై: మహరాష్ట్రలోని ఔరంగబాద్లో శుక్రవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. దీంతో రెండు వర్గాలు ఒకరిపై మరోకరు దాడులుకు దిగారు. దీంతో పరిస్థితిని అరుపులోకి తెచ్చేందుకు పోలీసులు 144 సెక్షన్ను విధించారు.
మహరాష్ట్రలోని ఔరంగాబాద్లో మే 11 వ తేది రాత్రి రెండు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ చోటు చేసుకొంది. రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. షాపులు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, 40 మందికి పైగా గాయాలైనట్టు సమాచారం. కుళాయి కనెక్షన్ విషయంలో తలెత్తిన వివాదానం ఘర్షణకు దారితీసిందని తెలుస్తోంది
ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. రెండు గ్రూపులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 144 సెక్షన్ విధించారు.
రెండు వర్గాల మధ్య చోటు చేసుకొన్న వివాదంలో వందలాది మంది రెండు గ్రూపులకు చెందిన వారు రోడ్లపైకి వచ్చి పరస్పరం రాళ్ళ దాడికి దిగారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.