వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేరుగా గదికి వెళ్లి లేడీ ప్రిన్సిపాల్‌ను తుపాకితో కాల్చి చంపాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హర్యానాలోని యుమునానగర్ పాఠశాలలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థి నేరుగా గదికి వెళ్లి కాల్పులు జరిపి ప్రిన్సిపాల్‌ను చంపేశాడు.

శనివారంనాడు ఆ ఘటన చోటు చేసుకుంది. తనను దూషించిందనే ఆగ్రహంతో విద్యార్థి ప్రిన్సిపాల్ రితు చాబ్రాపై కాల్పులు జరిపాడు. తన తండ్రిరకి ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో అతను ఆ ఘాతుకానికి ఒడిగట్టాడు.

 Class 12 Haryana student guns down principal in Yamunanagar school

నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటిండెంట్ రాజేష్ కాలియా చెప్పారు. వివేకానంద స్కూల్ ప్రిన్సిపాల్ రితు చాబ్రాకు కాల్పుల్లో మూడు తూటాలు తగిలాయి. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

నిందితుడి తండ్రి స్థిరాస్తి వ్యాపారి అని, అతనిపై కూడా కేసు నమోదు చేశామని రాజేష్ కాలియా చెప్పారు. రెండు వారాల క్రితం నిందితుడిని పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. పాఠశాలకు సరిగా రాకుండా చిల్లర తగాదాలకు దిగుతున్నాడనే కారణంతో ఆ చర్యలు తీసుకున్నారు.

శనివారర మధ్యాహ్నం అతను రివాల్వర్‌తో పాఠశాలకు వచ్చాడు. ప్రిన్సిపాల్‌ను కలుస్తానని చెప్పాడ. తర్వాత నేరుగా ప్రిన్సిపాల్ గదికి వెళ్లి, ఆమెపై కాల్పులు జరిపారు. సిబ్బంది అతన్ని పట్టుకున్నారు.

English summary
A Class 12 student of a private school in Haryana has been detained for allegedly shooting dead the principal on Saturday, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X