కదిలేకారులో మైనర్పై గ్యాంగ్రేప్, నిందితుల్లో దూరపు బంధువు
నోయిడా: కదిలే కారులో 17 ఏళ్ళ బాలికపై గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు దుండగులు, ఇంటి వద్ద దింపుతామని బాధితురాలిని నమ్మించి ఆ బాలికపై అత్యాచారం చేశారు. నిందితుల్లో బాలికకు ఇద్దరు తెలిసినవారు కూడ ఉన్నారు. మరో వ్యక్తి మాత్రం బాలికకు పరిచయం లేదు.
కాలేజీ బస్సు వెళ్ళిపోవడంతో ఇంటికి నడుచుకొంటూ వస్తుండగా తెలిసిన వ్యక్తులే కారులో ఇంటివరకు లిఫ్ట్ ఇస్తామని నమ్మించారు. అయితే ఆ బాలిక ఆ మాటలు నమ్మి మోసపోయింది.
కారులోనే బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు రోడ్డుపైనే వదిలేసి వెళ్ళారు. అయితే తమ కూతురు రోజు వచ్చే సమయం దాటుతున్నా రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు.
కదిలే కారులో గ్యాంగ్ రేప్
నోయిడాలో కదిలే కారులో 17 ఏళ్ళ బాలిక గ్యాంగ్రేప్కు గురైంది. కాలేజీ బస్సు వెళ్ళిపోవడంతో నడుచుకొంటూ ఇంటికి వెళ్తున్న బాలికను ముగ్గురు వ్యక్తులు ఇంటి వద్ద కారులో లిఫ్ట్ ఇస్తామని నమ్మించారు. ఆ బాలికకు ఇద్దరు వ్యక్తులు పరిచయస్తులే. వీరిలో ఒకరు బాలికకు దూరపు బంధువు. మరొకరు బాలిక క్లాస్మేట్, అయితే మూడో వ్యక్తి మాత్రం బాలికకు పరిచయం లేదు. కారులో కొద్దిదూరం వెళ్ళిన తర్వాత ఆమెపై నిందితులు గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు.ఈ ఘటన ఏప్రిల్ 18వ తేదిన జరిగింది.
రాత్రైనా ఇంటికి చేరలేదు
ప్రతి రోజూ కాలేజీ నుండి బాధితురాలు మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేది. కానీ ఏప్రిల్ 18వ తేదిన మాత్రం బాధితురాలు రాత్రి అవుతున్నా ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
బాలికను గుర్తించిన పోలీసులు
నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో అర్ధరాత్రి బాలికను గుర్తించారు. పాఠశాల బస్సు తప్పిపోవడంతో తాను ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా ముగ్గరు వ్యక్తులు వచ్చి తనను ఇంటి వద్ద దింపుతామని నమ్మించారని, కారులోకి ఎక్కాక వారు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపిందని పోలీసులు వెల్లడించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
బాలికపై గ్యాంగ్రేప్కు పాల్పడిన ముగ్గురు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఈ ఘటన జరిగి ఆరు రోజులు దాటుతున్నా ఇంతవరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదు.