యమునా నదిని శుభ్రం చేసిన పెద్దలు (వీడియో)
న్యూఢిల్లీ: భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన యమునా నదిని పెద్దలు శుభ్రం చేశారు. కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్య నాయుడు, ఉమాభారతీ, నితిన్ గడ్కరీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు గురువారం యమునా నదిని శుభ్రం చేశారు.
ఈ సందర్బంగా కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ భారతదేశంలో యమునా నది ప్రసిద్ధి చెందిందని అన్నారు. యమునా నదిని శుభ్రంగా పెట్టుకుని నది పవిత్రతను కాపాడుకోవాలని, అందుకు అందరి సహకారం కావాలని చెప్పారు.
యుమునా నదిని శుభ్రంగా పెట్టుకోవడానికి ఒక ప్రత్యేక కమిటి ఎర్పాటు చేశారు. ఆరు మంది ఉన్న ఈ కమిటి సభ్యులు నదిని ఏవిదంగా శుభ్రంగా పెట్టుకోవాలి, నీరు కలుషితం కాకుండ ఎలా చూసుకోవాలి అని ఒక నివేదిక తయారు చేసి సెప్టెంబర్ 30వ తేది లోపు కేంద్రానికి సమర్పిస్తుందని వెంకయ్య నాయుడు అన్నారు.
యమునా నదిని శుభ్రంగా పెట్టుకుని ఆ నీటిని ఢిల్లీ ప్రజలకు సరఫరా చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఇదే సందర్బంలో ఉమాభారతీ యమునా నది పవిత్రత గురించి వివరించారు.