తీర్పు అనుకూలంగా ఇస్తే ముడుపులు: సీబీఐ జడ్జి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కోల్ స్కాం కేసులో ప్రత్యేక సీబీఐ కోర్డు జడ్జి సంచలన వ్యాఖ్యాలు చేశారు. కోల్ స్కాంలో నిందితులుగా ఉన్న వారి పట్ల తీర్పు అనుకూలంగా ఇవ్వాలంటూ కొంతమంది న్యాయవాదులు తనను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జడ్జి వ్యాఖ్యానించారు.
నిందితుడి తరపు డిఫెన్స్ లాయర్ తనను సంప్రదించాడని, తీర్పు అనుకూలంగా ఇస్తే ముడుపులు ఇస్తామని చెప్పినట్లు ఆయన తెలిపారు. దీంతో ఆగ్రహించిన సీబీఐ కోర్టు జడ్జి ఇలాంటి మాటలు మరోసారి నా దృష్టికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
సీబీఐ కోర్టు జడ్జి వ్యాఖ్యలతో ఖంగుతిన్న డిఫెన్స్ లాయర్, కోర్టు హాలులోనే జడ్జిని క్షమాపణలు కోరారు. ఇంతకీ, ఆ డిఫెన్స్ లాయర్ ఎవరనే విషయాన్ని మాత్రం జడ్జి బయటకు చెప్పలేదు. అంతక ముందు కోల్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా విషయంలో కూడా వార్నింగ్ ఇచ్చారు.
ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన పేర్లను ఛార్జిషీట్లో ఎందుకు నమోదు చేయలేదని సీబీఐ ఇన్పెక్టర్ విజయ్ చెట్టీర్ను జడ్జి ప్రశ్నించారు. ఇందుకు కొన్ని డాక్యుమెంట్స్ను లేకపోవడంతో తప్పిదంగా రాతపూర్వక సమాధానమిచ్చాడు.