మేమైతే ప్రధాని కూడా దోషే: కోల్గేట్పై పరేఖ్ సంచలనం
ఒరిస్సాలోని బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగి ఉంటే ప్రధాని కూడా అందుకు కారణమవుతారని పరేఖ్ అన్నారు. బొగ్గు కేటాయింపులలో ప్రధానిదే తుది నిర్ణయమని, ఆయన కూడా నిందితుడవుతారన్నారు. అలాంటప్పుడు ఆయనపై అభియోగాలు ఎందుకు మోపలేదన్నారు.
బొగ్గు క్షేత్రాల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లయితే తనతో పాటు బిర్లా, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా బాధ్యులే అన్నారు. బొగ్గు క్షేత్రాలను అంతిమంగా అప్రూవ్ చేసింది ప్రధానే అన్నారు. బొగ్గు కేటాయింపు అవకతవకలపై సిబిఐ దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ కేటాయింపుల సమయంలో ప్రధాని వద్ద బొగ్గు శాఖ ఉంది.
పరేఖ్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన డిగ్గీ
బొగ్గు కుంభకోణం కేసులో తాము దోషులమైతే ప్రధాని కూడా దోషేనన్న పిసి పరేఖ్ వ్యాఖ్యలపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. పరేఖ్ ఏమైనా చెప్పదల్చుకుంటే సిబిఐకి చెప్పాలన్నారు.