షాక్: మావోలకు పట్టున్న ప్రాంతంలో 60 మంది కోబ్రా కమాండోలు అదృశ్యం
మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోనే ప్రత్యేక శిక్షణ పొందిన 60 మంది కమాండో లు అదృశ్యమయ్యారు.ఈ అదృశ్యమైన ఘటనపై సిఆర్ ఫిఎఫ్ అధికారులు విచారణకు ఆదేశించారు
న్యూఢిల్లీ:మావోయిస్టు వ్యతిరేక అటవీ యుద్ద నైపుణ్యాల యూనిట్ కు చెందిన 60మంది కోబ్రా కమాండోలు అదృశ్యమయ్యారు.మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంలో వీరు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.
మావోయిస్టు వ్యతిరేక అటవీ యుద్ద నైపుణ్యాల యూనిట్ కు చెందిన 60 మంది కోబ్రా కమాండోలు శిక్షణ పూర్తి చేసుకొన్నారు.
2011 లో విధుల్లో చేరిన 60 మంది జవాన్లు ఈ మధ్య కాలంలోనే అందరూ శిక్షణను పూర్తిచేసుకొన్నారు.ముఘల్సరై స్టేషన్ లో రైలు ఆగిన సమయంలో జవానులు వెళ్ళిపోయారని అధికారులు అనుమానిస్తున్నారు.
రైలులో ప్రయాణీస్తోన్న కమాండర్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వారు రైలును దిగివెళ్ళిపోయారని అధికారులు చెబుతున్నారు. బీహార్ లో జరుగుతున్న ప్రత్యేక నక్సల్ వ్యతిరేక పోరాటాల్లో వీరంతా చేరాల్సి ఉంది.జవాన్లలో ఎక్కువ మంది బీహర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారే.
రైలు నుండి ప్రత్యేక శిక్షణ పొందిన కమాండోలు మాయం కావడంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు.మావోల ప్రభావిత ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అధికారుల ఆందోళనను మరింత పెంచింది.ఈ ఘటనపై సిఆర్ పిఎఫ్ విచారణకు ఆదేశించింది.