ఈగ ఫేం సుదీప్ మోసం చేశాడని ఫిర్యాదు, సీఎంకు చెప్పాను: కాఫీ ఎస్టేట్ యజమాని ఆవేదన!
Recommended Video
బెంగళూరు: బహుబాష నటుడు, దర్శక నిర్మాత, ఈగ ఫేం సుదీప్ మోసం చేశాడని కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కాఫీ ఎస్టేట్ యజమాని దీపక్ మయూర్ కర్ణాటక ఫిల్మ్ చాంబర్ లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చెయ్యాలని కాఫీ ఎస్టేట్ యజమాని దీపక్ మయార్ మనవి చేశాడు.
హీరో సుదీప్ నిర్మాత
చిక్కమగళూరు తాలుకాలోని అవతి గ్రామం సమీపంలో దీపక్ మయూర్ కు కాఫీ ఎస్టేట్ ఉంది. హీరో సుదీప్ సొంత నిర్మాణ సంస్థ అయిన కిచ్చ క్రియేషన్ నిర్మాణ సారథ్యంలో వారస్థార (వారసుడు) అనే కన్నడ సీరియల్ చిత్రీకరించారు.
కాఫీ ఎస్టేట్ లో షూటింగ్
వారస్థార సీరియల్ ప్రముఖ టీవీ చానల్ లో ప్రసారం అవుతోంది. వారస్థార సీరియల్ ను కన్నడ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వారస్థార సీరియల్ అవతి గ్రామం సమీపంలో దీపక్ మయూర్ కు చెందిన కాఫీ ఎస్టేట్ లో చిత్రీకరించారు.
తీరని నష్టం జరిగింది
వారస్థార సీరియల్ చిత్రీకరణ సమయంలో కాఫీ తోట, అక్కడి చెట్లతో పాటు ఆ ప్రాంతంలో విలువైన వస్తువులు దెబ్బతిని తీరని నష్టం జరిగిందని, ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం తనకు నష్టపరిహారం చెల్లించకుండా హీరో సుదీప్, వారస్థార సీరియల్ బృందం తనను మోసం చేసిందని కాఫీ ఎస్టేట్ యజమాని దీపక్ మయూర్ ఆరోపిస్తున్నాడు.
సీఎంకు చెప్పినా ఫలితం లేదు
ఈ విషయంపై జనతా దర్శన్ లో ముఖ్యమంత్రి దగ్గర హీరో సుదీప్ మీద ఫిర్యాదు చేసినా ఇంత వరకూ ఎలాంటి న్యాయం జరగలేదని కాఫీ ఎస్టేట్ యజమాని దీపక్ మయూర్ ఆరోపిస్తున్నారు. తనకు అన్యాయం జరిగిందని చెప్పినా హీరో సుదీప్ ఇంత వరకు స్పందించలేదని దీపక్ మయూర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యాయం చెయ్యండి
హీరో సుదీప్ మీద చర్యలు తీసుకుని తనకు నష్టపరిహారం చెల్లించాలని ఇప్పుడు కర్ణాటక ఫిల్మ్ చాంబర్ లో ఫిర్యాదు చేశానని కాఫీ ఎస్టేట్ యజమాని దీపక్ మయూర్ అంటున్నారు. ఈ విషయంపై హీరో సుదీప్, కర్ణాటక ఫిల్మ్ చాంబర్ పెద్దలు ఇంత వరకూ స్పందించలేదు.