దారుణం: బధిర బాలికలపై స్కూల్ వ్యవస్థాపకుడే అత్యాచారం, గర్భం దాల్చిన బాలికలు
కంటికి రెప్పలా కాపాడాల్సిన పాఠశాల వ్యవస్థాపకుడే కీచకుడిగా మారాడు. బధిర అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీంతో ఇద్దరు బాలికలు గర్భం దాల్చారు.బాధితులు పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ ఘటన తమిళనాడు ర
కోయంబత్తూరు: కంటికి రెప్పలా కాపాడాల్సిన పాఠశాల వ్యవస్థాపకుడే కీచకుడిగా మారాడు. బధిర అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీంతో ఇద్దరు బాలికలు గర్భం దాల్చారు.బాధితులు పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది.
తమిళనాడు రాష్ట్రంలోని కొత్తపాళయంలో 57 ఏళ్ల మురుగసమి బధిర బాలికల పాఠశాలను నిర్వహిస్తున్నాడు.ఈ పాఠశాలలో బధిర అమ్మాయిలను ఉంటూ విద్యాబుద్దులు నేర్చుకొంటున్నారు.
ఈ పాఠశాలను స్థాపించిన కొద్ది కాలం నుండి ఆయన బధిర అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అయతే పాఠశాల వ్యవస్థాపకుడు ఈ దుర్మార్గానికి పాల్పడడంతో ఎవరూ అనే సాహసం చేయలేదు.
మురుగసమి కారణంతో ఈ పాఠశాలలోని ఇద్దరు బధిర బాలికలు గర్భందాల్చారు.దీంతో ఈ బాలికలు తిర్చూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వీరిద్దరే కాకుండా అనేకమంది అమ్మాయిలపై మురుగసమి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది.
అయితే పాఠశాల వ్యవస్థాపకుడు మురుగసమి బాలికలపై అత్యాచారానికి పాల్పడేందుకు పాఠశాల సూపర్ వైజర్ చిత్రాదేవి, వార్డెన్ పరిమిళ, ఆఫీస్ అసిస్టెంట్ రేవతి, బాబులు సహకరించారని బాలికలు పోలీసులకు పిర్యాదు చేశారు.నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.వీ