రాత్రంతా గడిపిన కాలేజ్ గర్ల్: రూ. 27లక్షలు లాగేసింది
జైపూర్: విహారయాత్రకు వచ్చిన యువకుడితో రాత్రంతా గడిపిన కాలేజ్ యువతి అతనిని బెదిరించి రూ. 27 లక్షలు లాగేసింది. మళ్లీ బ్లాక్ మెయిలింగ్ చెయ్యడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన ఈ బ్లాక్ మెయిలింగ్ కేసు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుర్గావ్ కు చెదిన ఓ యువకుడు ఈ నెల 8వ తేదిన జైపూర్ కు విహారయాత్రకు వెళ్లాడు. రాజస్థాన్ లోని జంజును జిల్లాకు చెందిన పీజీ విద్యార్థిని (19) కోఠిలోని హాస్టల్ లో నివాసం ఉంటున్నది.
గుర్గావ్ కు చెందిన యువకుడితో పరిచయం చేసుకున్న ఆ యువతి ఓ రోజు రాత్రి పూర్తిగా యువకుడి గది (గెస్ట్ హౌస్)లో గడిపింది. ఉదయం నిద్రలేచిన తరువాత ఆ యువతి పక్కన పడుకున్న యువకుడికి షాక్ ఇచ్చింది.
తాను అడిగిన సొమ్ము ఇవ్వకుంటే నీ అంతు చూస్తానని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడింది. తనకు రూ. 25 లక్షలు ఇస్తే నీకు భవిష్యత్తు ఉంటుందని, లేదంటే రేప్ చేశావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది.
పోలీసు కేసుకు భయపడిన ఆ యువకుడు ఆమె అడిగిన రూ. 25 లక్షలు ఇవ్వడానికి సిద్దం అయ్యాడు. యువతికి రూ. 25 లక్షలు ఇచ్చి భవిష్యత్తులో మళ్లి బ్లాక్ మెయిలింగ్ చెయ్యకుండా ఉండటానికి ఆమె దగ్గర బాండ్ పేపర్ల మీద సంతకం తీసుకున్నాడు.
బుధవారం మళ్లి ఆ యువకుడికి ఫోన్ చేసిన యువతి తనకు రూ. 18 లక్షలు ఇవ్వాలని లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. తన దగ్గర అంత డబ్బులేదని రూ. రెండు లక్షలు ఇస్తానని ఆ యువకుడు చెప్పాడు.
రెండు లక్షల రూపాయలు తీసుకోవడానికి యువతి అంగీకరించింది. జైపూర్ లోని నారాయణ్ సింగ్ సర్కిల్ దగ్గరకు వస్తే డబ్బు ఇస్తానని ఆ యువకుడు చెప్పాడు. తరువాత ఇక ముందు ఇలా జరకుండా జాగ్రత్త పడాలని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
నారాయణ్ సింగ్ సర్కిల్ దగ్గరకు వచ్చిన ఆ యువతి రూ. రెండు లక్షలు తీసుకుని యువకుడితో మాట్లాడుతున్నది. అదే సమయంలో డీసీపీ అనుష్మాన్ బోమియా తన సిబ్బందితో అక్కడికి చేరుకుని కాలేజ్ గర్ల్ ను అరెస్టు చేశారు.
ఆమె నుంచి రూ. 27 లక్షలు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ అనుష్మాన్ చెప్పారు. యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఆమె ఇంకా ఎంత మందిని ఈ విధంగా బ్లాక్ మెయిలింగ్ చేసింది అని ఆరా తీస్తున్నామని డీసీపీ అనుష్మాన్ చెప్పారు.