ప్రత్యేకం: 30 వసంతాలను పూర్తి చేసుకున్న '.కామ్' డొమైన్
న్యూఢిల్లీ: మంగళవారంతో .కామ్ డొమైన్ 30 వసంతాలను పూర్తి చేసుకుంది. మొట్టమొదటి .కామ్ డొమైన్ను మార్చి 15, 1985న సింబాలిక్స్ అనే కంపెనీ రిజిస్టర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వెబ్సైట్ను డల్లాస్కు చెందిన పెట్టుబడి సంస్ధ నిర్వహిస్తుంది.
30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు వరకు కూడా అద్భుతమైన డొమైన సర్వీసులను అందిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 270 మిలియన్ రిజిస్టర్ డొమైన్ పేర్లు ఉండటం విశేషం.
ఇందులో 42 శాతం మంది .కామ్ డొమైన్నే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. .కామ్ డొమైన్ రావడంతో అమెరికాలోని మిలియన్ల్ జనాభా ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ అనుభవాన్ని పొందగలిగారు. 1985 నుంచి .కామ్ సర్వీసులను సింబాలిక్స్ అనే కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.
.కామ్ డొమైన్ 30 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా వన్ఇండియా పాఠకులకోసం ప్రత్యేకంగా yourdomainsearch.com ద్వారా ఆఫర్లను ప్రకటించింది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ పేరు మీద .కామ్ వెబ్సైట్ను రిజిస్టర్ చేయించుకోండి.