వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మగ్లర్ కోసం ప్రాణాలు వదిలిన కమాండర్

|
Google Oneindia TeluguNews

బాలూర్ ఘాట్: భారత జవాన్లు దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం వదలడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారని మరో సారి రుజువు అయ్యింది. ఒక స్మగ్లర్ ను పట్టుకునేందుకు నదిలో దూకిన బీఎస్ఎఫ్ కమాండర్ జలసమాధి అయిన సంఘటన అందరిని కలిచివేసింది.

స్మగ్లర్ ను నదిలో వెంటాడిన బీఎస్ఎఫ్ కమాండర్ వీరమరణం పొందాడు. బీఎస్ఎఫ్ అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భారత్ -బంగ్లాదేశ్ సరిహద్దులో ఓ నది ప్రవహిస్తుంది. అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లు నిత్యం గస్తీ తిరుగుతుంటారు.

 Commander jumped into a local river which separates the two countries

ఈ ప్రాంతంలో బీఎస్ఎఫ్ సెక్టార్ కమాండర్ ప్రశాంత్ రాయ్ విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం భారత్ భూభాగంలోకి ఒక స్మగ్లర్ ప్రవేశిస్తున్న విషయం ప్రశాంత్ రాయ్ గుర్తించాడు. చోరబాటుదారుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

ఆ సందర్బంలో అతను నదిలో దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో ప్రశాంత్ రాయ్ నదిలో దూకి స్మగ్లర్ ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే కొంత దూరం ఈదిన తరువాత ప్రమాదవశాత్తు ప్రశాంత్ రాయ్ నీటిలో మునిగిపోయి ప్రాణాలు వదిలి పెట్టాడని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.

English summary
A BSF sector commander ranked official said Prashanta Roy drowned when he was swimming to get hold of a smuggler. who jumped into a local river which separates the two countries
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X