వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్‌లో పరిస్థితి చేయిదాటిపోయింది : రాష్ట్రపతి పాలన విధించాలని అమిత్ షాకు ముకుల్ లేఖ ?

|
Google Oneindia TeluguNews

కోల్‌కత : పశ్చిమబెంగాల్‌లో ప్రజాస్వామ్యం అపహస్యానికి గురవుతుందన్నారు బీజేపీ నేత ముకుల్‌రాయ్. రాజ్యాంగ వ్యవస్థలను సీఎం మమతా బెనర్జీ నీరుగార్చారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడిందని .. వెంటనే కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. వెంటనే జోక్యం చేసుకొని .. రాష్ట్రపతి పాలన దిశగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. లేదంటే రాష్ట్రంలో పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రవిప్రకాశ్‌పై కేసులకు నిరసనగా జర్నలిస్టుల దీక్ష.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా రవిప్రకాశ్‌పై కేసులకు నిరసనగా జర్నలిస్టుల దీక్ష.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

చర్యలు తీసుకొండి ..
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను హోంమంత్రి అమిత్ షాకు లేఖలో వివరించారు ముకుల్ రాయ్. బెంగాల్‌లో అరాచకం రాజ్యమేలుతుందని అందులో పేర్కొన్నారు. వెంటనే రాష్ట్రపతి పాలన దిశగా హోంశాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య జరుగుతున్న దాడులను అరికట్టడంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని గుర్తుచేశారు. దీంతో రాష్ట్రంలో అంశాంతి నెలకొందని పేర్కొన్నారు. బెంగాల్‌లో ఈ పరిస్థితికి కారణం టీఎంసీని అని లేఖలో ఆరోపించారు.

Complete anarchy in Bengal: BJP leader Mukul Roy writes to Amit Shah, asks MHA to step in

మమత ప్రోద్బలంతోనే ...
బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ ప్రోద్బలంతోనే టీఎంసీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన దాడులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మమతా బెనర్జీ కారణమని ఆరోపించారు. ఆమె అండదండలతోనే టీఎంసీ కార్యకర్తలు పెట్రేగిపోయారని గుర్తుచేశారు. పరిస్థితి రాష్ట్ర యంత్రాంగం చేయిదాటిపోయిందని .. వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన ఘర్షణలో 10 మంది కార్యకర్తలు చనిపోతే .. 8 మంది టీఎంసీకి చెందినవారని మమత పేర్కొన్న సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత కూచ్ బెహర్, ఉత్తర 24 పరగణ, హౌరా, పశ్చిమ బుర్దాన్‌లో కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో కొందరు కార్యకర్తలు చనిపోగా .. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

English summary
west Bengal BJP leader Mukul Roy has written to Union Home Minister Amit Shah, claiming that there has been a "complete breakdown" of the state machinery in the state. Post-poll violence in the state has escalated with both BJP and TMC accusing the other of stoking political unrest. Mukul Roy's letter was in response to the letter submitted by the Trinamool Congress to the Home Ministry. Mukul Roy claimed that "there is complete anarchy and chaos throughout the state of West Bengal".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X