times now exit poll: కాంగ్రెస్ కూటమికి 44 సీట్లు, 28 సీట్లతో బీజేపీ సెకండ్ ప్లేస్
జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి కొలువుదీరబోతుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. 44 సీట్లతో మెజార్టీ మార్క్ దాటుతుందని చెప్పడం విశేషం. మిగతా సంస్థలు 39, 40 సీట్లు గెలుచుకుంటాయని పేర్కొన్నగా.. టైమ్స్ నౌ అంచనాలు మాత్రం ఒక్కడుగు ఎక్కువే ఉండటం కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది.
Kashish News Exit Poll Results: జార్ఖండ్లో కాంగ్రెస్ హవా, వెనకబడ్డ బీజేపీ
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి 44 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని టైమ్స్ నౌ లెక్కగట్టింది. కూటమిలో జేఎంఎం 23 సీట్లు దక్కనుండగా, కాంగ్రెస్ పార్టీకి 16 సీట్లు, ఆర్జేడీకి 5 స్థానాల్లో విజయం సాధిస్తోందని తెలియజేసింది. బీజేపీ 28 సీట్లు, జేవీఎం 3 సీట్లతో సరిపెట్టుకుందని వెల్లడించింది. ఇతరులు ఆరు సీట్లను గెలవనుండగా ఏజేఎస్యూ ఖాతా తెరవబోదని చెప్పడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడని విషయం.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేజీ రెండోస్థానానికి పరిమితమవుతోందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఆ పార్టీ మెజార్టీ మార్క్కు ఆమడదూరంలో నిలిచిపోతుందని పేర్కొన్నాయి. కానీ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ (ఏజేఎస్యూ) మాత్రం బీజేపీ వెన్నంటే ఉంటానని భరోసానిచ్చింది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారంలోకి రాదని చెబుతోన్నా.. ఏజేఎస్యూ మాత్రం కమల దళం వైపు ఉండటం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.