అసెంబ్లీ ఉప ఎన్నికలు, సమస్తిపూర్ లోక్సభ బై పోల్కు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే
కాంగ్రెస్ పార్టీ కూడా తమ క్యాండెట్లను ప్రకటించింది. బీజేపీ 32 స్థానాలకు ఉప ఎన్నిక అభ్యర్థులను ప్రకటించిన కొద్దిసేపటికే బీహర్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీహర్లోని ఒక లోక్ సభ, రాజస్థాన్, యూపీలోని 4 అసెంబ్లీ స్థానాలకు గెలుపుగుర్రాలను బరిలోకి దింపింది.
సోనియా ఆమోదం
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అభ్యర్థుల లిస్ట్కు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు. బీహర్ సమస్తిపూర్ నుంచి అశోక్ కుమార్ పోటీ చేస్తారని తెలిపారు. ఇక్కడ లోక్ జనశక్తి పార్టీ నుంచి విజయం సాధించిన రామ్ చంద్ర పాశ్వాన్ మృతిచెందడంతో ఎన్నిక అనివార్యమైంది.
ఇదీ లెక్క
బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్, హిందుస్థానీ అవామ్ మోర్చా, 40 లోక్ సభ స్థానాలకు కలిసి పోటీచేసిన సంగతి తెలిసిందే. బీహర్లోని కిసన్ గంజ్ నుంచి సయ్యద్ బను, రాజస్థాన్ మంద్వానా నుంచి రీతా చౌదరి, కివసార్ నుంచి మిర్దా, యూపీలోని బల్హా నుంచి మన్ను దేవి బరిలోకి దిగారు.
ఇదీ బీజేపీ లిస్ట్
దేశవ్యాప్తంగా 32 చోట్ల అసెంబ్లీ ఉప ఎన్నికల జాబితాను బీజీపే విడుదల చేసింది. యూపీలోని 10 స్థానాలు, కేరళలో 5, అసోంలో 4, హిమచల్ ప్రదేశ్, పంజాబ్, సిక్కిం 2, బీహర్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ మేఘాలయ, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. వీటిలో 32 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మొత్తం 51 ఉప ఎన్నిక స్థానాలకు ఎన్నిక జరగనుంది. మరో 19 మంది అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని బీజేపీ నేతలు తెలిపారు.