బాబ్రీ మసీదు కేసు నుంచి కపిల్ సిబాల్ను తప్పుకోమన్న కాంగ్రెస్!
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కేసులో సున్నీ వక్ఫ్ బోర్డు తరపున కేసు వాదిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ను ఆ కేసు నుంచి తప్పుకోమని ఆ పార్టీ అధిష్టానం కోరినట్లు సీఎన్ఎన్-న్యూస్18 పలు కథనాలను ప్రసారం చేసింది.
రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసు సుదీర్ఘ కాలంగా కోర్టులోనే ఉన్న కేసే కాకుండా.. దేశంలోనే ఇదొక వివాదాస్పద స్థలంగా మారింది. 2019 వరకు ఈ కేసుపై వాదనలు వినవద్దని ఆయన సుప్రీంకోర్టులో విజ్ఞప్తి చేశారు. అయితే పిటీషిన్ ను కోర్టు తోసిపుచ్చింది.
కాగా, తాము ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ కపిల్ సిబాల్ మాత్రం కోర్టుకు ఇలా ఎలా ఎందుకు చెప్పారో తమకు అర్థం కావడం లేదని సున్నీ వక్ఫ్ బోర్డు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే సిబాల్ను వైదొలగాలని కాంగ్రెస్ అధిష్టానం కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.