అయోధ్యపై ఎట్టకేలకు మౌనం వీడిన కాంగ్రెస్- ట్విట్టర్లో ప్రియాంక రియాక్షన్ ఏంటో తెలుసా ?
కేంద్రంలోని అధికార బీజేపీ అయోధ్యలో ఒకటైన రామమందిరం అంశంపై సాధ్యమైనంత తక్కువగా మాట్లాడే విపక్ష కాంగ్రెస్ పార్టీ.. త్వరలో జరిగే రామాలయ భూమిపూజ విషయంలోనూ అంతే మౌనం పాటిస్తూ వచ్చింది. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ యువనేత ప్రియాంకా గాంధీ ఇవాళ స్పందించారు.
అయోధ్యలో రామాలయ భూమిపూజకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఈ విషయంపై కాంగ్రెస్ యువనేత ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రామాలయ భూమిపూజ జాతి ఐక్యమత్యం, సంస్కృతి, సామాజిక భావానికి ప్రతిబింబమని ప్రియాంక పేర్కొన్నారు. నిరాడంబరం, ధైర్యం, సహనం, త్యాగం, పట్టుదలకు మారురూపమైన దీన బంధు రాముడని, ప్రతీ ఒక్కరిలోనూ రాముడున్నాడని ప్రియాంక తెలిపారు. సీతారాముల సందేశం, దీవెనలకు ప్రతిరూపంగా జరిగే భూమి పూజ జాతి ఐక్యతా చిహ్నంగా ఉండబోతోందని ప్రియాంక తన ట్వీట్ లో అభివర్ణించారు.
Recommended Video
ప్రపంచ, భారత ఉపఖండ సాంసృతిక చరిత్రలో రామాయణం చెరిగిపోని గుర్తు అని, వేల సంవత్సరాల నాటి భారతీయ సంస్కృతిలో సీతారాముల చరిత్ర అజరామరంగా ఉండిపోయిందని ప్రియాంక పేర్కొన్నారు. భారత భూభాగంపై రాముడు చూపిన ఐక్యత శతాబ్దాలు మారుతున్నా నిలిచిపోయిందని ప్రియాంక గుర్తుచేశారు.