యడ్యూరప్ప రాజీనామా, మోడీ-షాలపై పోరు: కాంగ్రెస్ పార్టీకి ఓ పాఠం
Recommended Video
న్యూఢిల్లీ: కర్ణాటక ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓ విషయాన్ని గుర్తించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ - అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీని ఓడించడం ఆ ఒక్క పార్టీ వల్ల, రాహుల్ గాంధీ ఒక్కడి వల్ల కాదని తేలిపోయిందని అంటున్నారు.
కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకు సాగితేనే బీజేపీని ఎదుర్కోవచ్చునని అంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలు కలిసికట్టుగా పని చేసినందువల్లే యడ్యూరప్ప రాజీనామా చేశారని గుర్తు చేస్తున్నారు.
ఇటు కుమారస్వామి లేక అటు కాంగ్రెస్ నేతలు ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీకి జారిపోకుండా జాగ్రత్తపడ్డారు. అసలు, కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ కలిసి పోటీ చేస్తే బీజేపీ సీట్లు మరిన్ని తగ్గేవని, ఆ పార్టీలకు స్పష్టమైన మెజార్టీ వచ్చి ఉండేదని అంటున్నారు. బీహార్లో కూడా కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీలు కలిసి పోటీ చేసి బీజేపీని ఓడించాయని గుర్తు చేస్తున్నారు.