షాకింగ్: కుమారస్వామికి దొరకని గవర్నర్ అపాయింటుమెంట్? కాంగ్రెస్ ముందు 3 ప్లాన్లు
బెంగళూరు: జేడీఎస్ అధినేత కుమార స్వామి గురువారం మధ్యాహ్నం రాజ్ భవన్ చేరుకున్నారు. జేడీఎస్ శాసన సభా పక్షం ఆయనను జేడీఎస్ఎల్పీగా ఎన్నుకున్న అనంతరం సోదరుడు రేవణ్ణతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం రాజ్ భవన్ వచ్చారు.
మేమంతా ఒక్కటే: బీజేపీకి రేవణ్ణ షాక్, బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసిందని కుమారస్వామి సంచలనం
తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన గవర్నర్ను కోరనున్నారు. ఈ మేరకు తనకు మద్దతిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల జాబితాను ఆయనకు సమర్పించనున్నారు. అయితే కుమారస్వామికి గవర్నర్ అపాయింటుమెంట్ దొరకలేదని తెలుస్తోంది.
అంతకుముందు బీజేపీఎల్పీ యడ్యూరప్ప గవర్నర్ను కలిసి తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను సమర్పించారు. ఓ వైపు బీజేపీ తమ ఎమ్మెల్యేలను లాక్కుంటోందని ఆరోపిస్తున్న జేడీఎస్ - కాంగ్రెస్ పార్టీలు.. బీజేపీ ఎమ్మెల్యేలపై కన్నేశాయి. బీజేపీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు తమ వైపుకు రావాలని జేడీఎస్ అధినేత కుమారస్వామి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ - జేడీఎస్ల ముందు మూడు వ్యూహాలు
గవర్నర్ తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుంటే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ముందు మూడు వ్యూహాలు ఉన్నాయని తెలుస్తోంది. 1. జేడీఎస్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ వద్ద పరేడ్ నిర్వహించడం. 2. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించకుంటే సుప్రీం కోర్టుకు వెళ్లడం. 3. జేడీఎస్-కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రపతి వద్ద పరేడ్ నిర్వహించడం.