వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: కుమారస్వామికి దొరకని గవర్నర్ అపాయింటుమెంట్? కాంగ్రెస్ ముందు 3 ప్లాన్‌లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: జేడీఎస్ అధినేత కుమార స్వామి గురువారం మధ్యాహ్నం రాజ్ భవన్ చేరుకున్నారు. జేడీఎస్ శాసన సభా పక్షం ఆయనను జేడీఎస్ఎల్పీగా ఎన్నుకున్న అనంతరం సోదరుడు రేవణ్ణతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం రాజ్ భవన్ వచ్చారు.

మేమంతా ఒక్కటే: బీజేపీకి రేవణ్ణ షాక్, బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసిందని కుమారస్వామి సంచలనంమేమంతా ఒక్కటే: బీజేపీకి రేవణ్ణ షాక్, బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసిందని కుమారస్వామి సంచలనం

తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన గవర్నర్‌ను కోరనున్నారు. ఈ మేరకు తనకు మద్దతిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల జాబితాను ఆయనకు సమర్పించనున్నారు. అయితే కుమారస్వామికి గవర్నర్ అపాయింటుమెంట్ దొరకలేదని తెలుస్తోంది.

Congress, JD(S) leaders to meet Karnataka governor for government formation

అంతకుముందు బీజేపీఎల్పీ యడ్యూరప్ప గవర్నర్‌ను కలిసి తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను సమర్పించారు. ఓ వైపు బీజేపీ తమ ఎమ్మెల్యేలను లాక్కుంటోందని ఆరోపిస్తున్న జేడీఎస్ - కాంగ్రెస్ పార్టీలు.. బీజేపీ ఎమ్మెల్యేలపై కన్నేశాయి. బీజేపీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు తమ వైపుకు రావాలని జేడీఎస్ అధినేత కుమారస్వామి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ - జేడీఎస్‌ల ముందు మూడు వ్యూహాలు

గవర్నర్ తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుంటే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ముందు మూడు వ్యూహాలు ఉన్నాయని తెలుస్తోంది. 1. జేడీఎస్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ వద్ద పరేడ్ నిర్వహించడం. 2. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించకుంటే సుప్రీం కోర్టుకు వెళ్లడం. 3. జేడీఎస్-కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రపతి వద్ద పరేడ్ నిర్వహించడం.

English summary
Congress, JD(S) leaders to meet Karnataka governor for government formation .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X