రాజ్యసభను వృద్ధాశ్రమం చేయవద్దు, కురియన్ ఇక తప్పుకోవాలి: కేరళ కాంగ్రెస్
తిరువనంతపురం: రాజ్యసభను వృద్ధాశ్రమంగా మార్చవద్దని, యువకులకు అవకాశాలు ఇవ్వాలని కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఇకనైనా రాజకీయాల నుంచి సెలవు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
కాగా, జూన్ నెలలో కేరళలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో కురియన్ రీ-నామినేషన్ అంశం చర్చనీయాంశమైంది. 'ఇప్పటికే 3 సార్లు రాజ్యసభకు ఎన్నికైన కురియన్ ఈసారైన తెలివైన నిర్ణయం తీసుకుని పార్లమెంటరీ రాజకీయాల నుంచి తప్పుకుంటారని భావిస్తున్నాం' అని కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీటి బలరాం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిప్రాయపడ్డారు.
బలరాం వ్యక్తపరిచిన అభిప్రాయాన్నే పార్టీలోని మరికొందరు ఎమ్మెల్యేలు బలపరిచారు. రాజ్యసభను ఒక వృద్ధాశ్రమంగా మార్చాలని పార్టీ అనుకోవడం లేదని వారు గుర్తుచేస్తున్నారు. యువకులకు కాంగ్రెస్ పార్టీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను గుర్తుచేసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
కేరళ కాంగ్రెస్ చీఫ్ ని మారుస్తారా?కేరళ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయంపై కురియన్ కూడా సానుకూలంగానే స్పందించారు. పార్టీ వెళ్లిపోమంటే అందుకు తాను సిద్దమని చెప్పారు.
చెంగనూర్ ఉపఎన్నికలో ఓటమితో పార్టీలో వాడి వేడి చర్చ జరుగుతోంది. ఓటమికి నేపథ్యంలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎంఎం హసన్ ను తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోనియా గాంధీ చికిత్స నిమిత్తం విదేశాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరిగి రాగానే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.