వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పెద్దలకు షాక్ ఇచ్చిన మాజీ సీఎం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ వ్యవహారంపై అదే పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి షాక్ ఇచ్చారు. వరుసగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు ఏసీ రూంలలో కుర్చుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి సమయం లేదా అన్నారు.

కర్ణాటకలో వరుసగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కోందరు ఆర్థిక సమస్యలు, కోందరు పంట నష్టంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రిగా పని చేసిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్.ఎం. కృష్ణ ఇంటికి శుక్రవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డి.కే. శివకుమార్ వెళ్లారు.

SM Krishna

ఆ సందర్బంలో ఎస్.ఎం. కృష్ణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రులు కాని, ముఖ్యమంత్రి కాని ఇప్పటి వరకు ఒక కుటుంభాన్ని పరామర్శించలేదని విచారం వ్యక్తం చేశారు.

మీరు చాల బిజిగా ఉన్నారు, రైతుల కష్టాలు కనపడటం లేదు, నేనే వెళ్లి పరామర్శిస్తానని ఎస్.ఎం. కృష్ణ గట్టిగా చెప్పారు. సోంత పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు స్వయంగా ముఖ్యమంత్రి పనితీరుపై మండిపడటంతో కాంగ్రెస్ పెద్దలు, నాయకులు షాక్ కు గురైనారు.

English summary
Congress leader and former chief minister SM Krishna
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X